ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరీ రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను బందీలుగా చేసుకుని రాజ్యాలను ఆక్రమించుకుంటున్న ఉగ్రవాదులు.., వారి ఆకృత్యాలపై గలమెత్తిన ప్రతి ఒక్కరినీ హతమారుస్తున్నారు. అమెరికా ప్రభుత్వం బాంబులు వేస్తే.., ఉగ్రవాదుల కోపానికి బంధీలుగా ఉన్న జర్నలిస్టులు బలయ్యారు. తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఉద్యోగులను కూడా ఉగ్రవాదులు హెచ్చరించారు. ట్విట్టర్ ఉద్యోగులందర్నీ చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపు సందేశాలు సోషల్ మీడియా సైట్లతో పాటు నేరుగా ట్విట్టర్ లోనే పోస్ట్ చేసి ఉద్యోగులను బెదిరించారు.
ప్రతి ఉద్యోగినీ చంపాలని పిలుపు
అమెరికా యూరప్ దేశాల్లో ‘‘లోన్ వూల్ప్స్(ఉగ్రవాదుల కోసం పనిచేసే వ్యక్తులు) ట్విట్టర్ ఉద్యోగుల కదలికలపై కన్నేసి ఉంచాలని ఆదేశించారు. వారు ఎక్కడ కన్పించినా దాడులు చేసి హతమార్చాలన్నారు. ఏ ఒక్క ఉద్యోగినీ వదిలి పెట్టవద్దనీ.., ప్రతి ఒక్కరినీ చంపాలని స్పష్టం చేశారు. ఇక ట్విట్టర్ యజమాన్యంపై అయితే నేరుగా దాడులు చేయాలని చెప్పారు. స్లీపర్ సెల్స్, లోన్ వూల్ప్స్ ఈ దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇస్లామిక్ స్టేట్ పిలుపునిచ్చింది. ట్విట్టర్ ఉద్యోగి ఇంటి బయట కూడా ఉగ్రవాది ఉంటాడనే విషయం వారు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.
గతంలో ఈజిప్టులో ఏళ్లుగా కొనసాగిన ప్రజా ఉద్యమం సోషల్ మీడియా ద్వారా ఉదృతమై వారికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాయన్నమాట. అలాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) ఉగ్రవాదుల ఆగడాలకు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వారి ఆకృత్యాలపై ప్రజలు మండిపడుతున్నారు. ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలని ఆగ్రహంతో ఊగిపోతూ సందేశాలు పంపుతున్నారు. దీంతో ట్విట్టర్ పిట్ట తమ కంట్లో పొడుస్తుందని భయపడ్డ ఉగ్రవాదులు ఉద్యోగులందర్నీ హతమార్చాలని నిర్ణయించారు.
ఈ బెదిరింపులపై అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని చెప్పింది. అటు సందేశాలు పోస్ట్ చేసిన రెండు ట్విట్టర్ అకౌంట్లను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇలాంటి సందేశాలను ఫిల్టర్ చేసి నిఘా పెడుతున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా, యూరప్ దేశాల్లో ట్విట్టర్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహకరించే కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉండటం ఆందోళన కల్గించే విషయం. ఏం భయం లేదని యాజమాన్యం చెప్తున్నా.., ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో అని సగటు ఉద్యోగులు వణుకుతున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more