(Image source from: governor narasimhan orders to andhra telangana states)
రెండు తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ -ఆంధ్రాలకు గవర్నర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న నరసింహన్... తాజాగా ఆ రెండు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే అల్-కాయిదా ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పోలీసులను అప్రమత్తం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని.. గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భ్రదతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటలిజెన్స్ అధికారులకు ఆయన సూచించారు. ఈ ఉగ్రవాద దాడులను అరికట్టాలంటే ప్రస్తుతం రెండు రాష్ట్రాలు సమన్వయంగా నడుచుకుంటూనే సాధ్యపడుతుందని.. కాబట్టి తమ మధ్య వున్న విభేదాలను పట్టించుకోకుండా ఉమ్మడిగా ముందుకు సాగి, నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆదేశించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ అల్-కాయిదా చీఫ్ అల్ జవహరి ఇటీవలే ఒక వీడియో ప్రసంగం ద్వారా అందరికీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం రాజ్ భవన్ లో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఏపీ ఇంటెలిజన్స్ అదనపు డీజీ ఏఆర్ అనురాధ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితర అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో వున్న శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. సోమవారం హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరగనుండటంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాట్ట గురించి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి నిర్లక్ష్యం వుండకూడదని ఆయన అధికారులను హెచ్చరించారు.
గణేశ్ నిమజ్జనోత్సవం కోసం 15 వేల మందికి పైగా పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్ఎఎఫ్ తదితర సాయుధ బలగాలను రంగంలోకి దించామని, మరి కొన్ని బలగాలను సిద్ధంగా ఉంచామని తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్రెడ్డి గవర్నర్కు తెలిపారు. కాగా బందోబస్తుకు అవసరమైన సిబ్బందిని, అధికారులను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనురాధ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more