Servant murdered for 4orupees

servant, jarkhand, owner, employer, employee, salary, wages, forty rupees, rice, poilce station, murder for money, dumaria police station, latest news

servant in jarkhand murdered his employer for 40rupees : sevent murders his boss for pending of his wage of rupees 40 in jarkhand

రూ.40వేతనం కోసం యజమాని హత్య

Posted: 09/05/2014 03:37 PM IST
Servant murdered for 4orupees

డబ్బులు ఏంత పనయినా చేయిస్తాయని తెలుసు. డబ్బుల కోసం ఏమయినా చేసేవారు చాలామందే ఉంటారు. వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తిని కొట్టేవారి గురించి విన్నాం కానీ.., నలబై రూపాయల గురించి నిండు ప్రాణం బలితీసుకున్న సంఘటన గురించి ఇప్పుడే వింటున్నాం. జార్ఖండ్ లోని ఓ పశువుల కాపరి.., తనకు రావాల్సిన నలబై రూపాయల వేతనం కోసం యజమానిని కొట్టి చంపాడు. ప్రస్తుతం నిందితుడిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘట్ సిలా ప్రాంతంలో ఉండే ఓ గిరిజనుడిని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పశువుల కాపరిగా పనికి పెట్టుకున్నాడు. ఇందుకు అతనికి నలబై రూపాయల బియ్యం, కొంత బియ్యం వేతనంగా ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చకున్నారు. అయితే వేతనం ఇవ్వటంలో యజమాని ఆలస్యం చేశాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని గిరిజన యువకుడు పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. గొడవ పెరిగి కొట్టుకునే స్థాయికి చేరింది. కోపంలో గిరిజన యువకుడు చేసిన దాడిలో యజమాని చనిపోయాడు.

విషయం తెలుసుకున్న దుమారియా పోలిసులు కేసు నమోదు చేసుకుని గిరిజన యువకుడిని అరెస్టు చేశారు. వేతనం కోసం జరిగిన పెనుగులాటలో నిందితుడు దాడి చేయటంతో యజమాని చనిపోయాడు తప్ప ఇద్దరికీ ఎలాంటి పాత కక్ష్యలు లేవని వెల్లడించారు. నలబై రూపాయల కోసం నిండు జీవితం బలయిపోగా.., యువకుడు జైలు పాలయ్యాడు. అందుకే పెద్దలన్నారు.., ఆవేశం అనర్ధాలకు మూలం అని.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murder  money  jarkhand  latest news  

Other Articles