భారత్ పాక్ యుద్ధం వస్తే దేశంలోని ముస్లిం యువత పాక్ కోసం పోరాడుతుందన్న వివాదాస్పద వార్తపై ఎంపీ, మజ్లిస్ అధినేత అక్బరుద్ధీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. కాశ్మిరీ అబ్జర్వర్ అనే వెబ్ సైట్లో వచ్చిన ఈ వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దేశ యువత, దాయాది దేశం కోసం పోరాడుతుందన్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్నాయి. అటు ఈ వార్తపై తీవ్ర విమర్శలు కూడా రావటంతో అసద్ వివరణ ఇచ్చారు. తాను ఆ మాటలు అనలేదని స్పష్టం చేశారు. తన పేరుపై ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వార్త ఉన్న వెబ్ సైట్ పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా తనపై ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవటంపై కూడా న్యాయ సలహా తీసుకుంటున్నట్లు అసద్ తెలిపారు.
కాశ్మీర్ అబ్జర్వర్ వెబ్ సైట్లో వచ్చిన వార్త...
భారత ముస్లింలంతా పాక్ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని అసద్ పిలుపునిచ్చినట్లు కాశ్మిర్ అబ్జర్వర్ వెబ్ సైట్ తెలిపింది. సోషల్ మీడియాలో ఇదే అంశంతో ప్రచారంలో ఉన్న ఓ పోస్టర్ ఆధారంగా ఈ వార్త రాసినట్లు సైట్ తెలిపింది. దేశంలోని ముస్లింలను హిందువులు భారతీయులుగా చూడటం లేదనీ.., భారత ముస్లీంలను కూడా పాకిస్థానిలుగా పరిగణిస్తున్నారని అసద్ అన్నట్లు తెలిపింది. భవిష్యత్ లో భారత్ పాకిస్థాన్ తో యుద్ధానికి సిద్ధపడితే 250 మిలియన్ల భారత ముస్లింలు పాకిస్థాన్ తో చేతులు కలిపి భారత్ పై యుద్ధం చేస్తారని అసద్ అన్నట్లు పేర్కొంది.
ఇప్పుడీ వార్త తీవ్ర దుమారం రేపటంతో ముందస్తు జాగ్రత్తగా అసదుద్దీన్ స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అసద్, అక్బర్ సోదరులు ఇప్పటికీ కోర్టు కేసులు ఎదుర్కుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more