పాకిస్థాన్ దుశ్చర్యలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. పోనీలే అని భారత్ ఊరుకుంటుంటే దాయాది సైన్యం ఇదే అదునుగా రెచ్చిపోతుంది. భారత స్థవరాలపై తుపాకులతో విరుచుకుపడుతుంది. మదమెక్కిన పాక్ ఆర్మీ.., కయ్యానికి కాలు దువ్వుతూ భారత సరిహద్దుపై కాల్పులు జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్ సాంబ జిల్లాలోని ఆర్నియా, ఆర్ ఎస్ పురా, కానాచక్, అఖ్నూర్ సెక్టార్లపై విరుచుకుపడ్డాయి, ఆదివారం అర్ధ రాత్రి కాల్పులు మొదలుపెట్టిన పాకిస్థాన్ ఈ ఉధయం వరకు కూడా కాల్పులు జరుపుతూనే ఉంది. అయితే వీరికి భారత సైన్యం కూడా తుపాకులతో ధీటుగా సమాధానం ఇవ్వటంతో ఎలాంటి నష్టం జరగలేదు.
గ్రామాలపైకి మోర్టార్ బాంబులు
సరిహద్దులోని భారత సైనిక స్థావరాలతో పాటు సమీప గ్రామాల్లోని అమాయక ప్రజలను కూడా పాక్ టార్గెట్ చేసుకుంది. సరిహద్దలోని 24గ్రామాలపై విచక్షణా రహితంగా ఉగ్రవాదుల్లా కాల్పులకు తెగబడింది. అంతేకాకుండా మోర్టారు బాంబులను విసిరేసింది. ఈ బాంబులు పేలి ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు. వీరిని ఆర్మి ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కూడా భారత స్థావరాలు, సరిహద్దు గ్రామాలపై దాయాది ఆర్మీ కాల్పులు జరుపుతుండటంతో సామాన్య ప్రజలు భయంతో వణికిపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని రాత్రంతా నిద్రపోకుండా భయపడుతూ గడిపారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో భారత సరిహద్దు రక్షణా దళం ఆదీనంలోకి తీసుకుని పహారా కాస్తుంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. గత 15 రోజుల్లోనే 23సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఆర్మీ ఉల్లంఘించింది. ఇక జులై 16 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు భారత్ పై కాల్పులు జరిపింది. తాము భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరకుంటున్నట్లు చెప్తూనే.., సరిహద్దుపై కాల్పులకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని పాక్ ఆర్మీ పెంచి పోషిస్తోందని ప్రధాని మోడి వ్యాఖ్యలు చేస్తే.., దీనిపై పాక్ ఆర్మీ స్పందించలేదు. దీన్నిబట్టే వారేమిటో అందరికి అర్ధం అవుతోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more