ఇన్నాళ్లవరకు ఉద్యోగులను ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. చివరికి ఒక కమ్మనైనా తియ్యని వార్తను ప్రసాదించింది. నిరుద్యోగులకు ఇకనుంచి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని టీడీపీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతలందరూ తలల బాదుకుంటున్నప్పటికీ... వారు మాత్రం నిరుద్యోగులకు కొంత ఉపశమనాన్నే కలిగించారు. శనివారంనాడు వాదోపవాదల మీద ప్రారంభమైన అసెంబ్లీలో నేతల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సందర్భంలో నిరుద్యోగుల ప్రస్తావన రాగా.. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ప్రకటన జారీ చేసింది.
టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలముందు నిరుద్యోగులకు ఉద్యోగభృతి కింద వెయ్యి రూపాయలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ ఆర్థికమంత్రి మంత్రి యనమల రామకృష్ణుడు ఆ హామీపై స్పష్టతనిస్తూ.. బడ్జెట్ పాస్ అయిన తర్వాత నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యనమల ఈ ప్రకటన చేశారు. అంతేకాదు.. అంతేకాకుండా, నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు ఏపీపీఎస్సీ బోర్డులో మార్పులు తీసుకువచ్చి ప్రక్షాళన చేస్తామని అన్నారు.
నిరుద్యోగులు ఎంత ఎక్కువగా పెరిగిపోతే.. ప్రభుత్వ ఖజానాపై అంతకంటే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరలోనే పెట్టుబడులను ఆకర్షించి.. ఏపీలో సరికొత్త పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా కొంతలో కొంతమేరకైనా నిరుద్యోగతిని తగ్గుతుందనే భావంతో టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఏదిఏమైనా.. విభజన అనంతరం ఉద్యోగాల టెన్షన్ లో మునిగిపోయిన నిరుద్యోగులందరికీ తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో వేచి చూడాలి..!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more