ఇన్నాళ్లవరకు కనుమరుగైపోయిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం.. తిరిగి తెరమీదకు మరో వివాదంతో వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఈ ఈ కంపెనీ.. 2000 సంవత్సరంలోనే అకౌంటింగ్ విభాగంలో కుంభకోణానికి పాల్పడిందంటూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ స్పష్టం చేస్తోంది. ఇదిలావుండగా.. తాజాగా ఈ స్కాంకు పాల్పడినవారి పేర్లలో టీవీ9 ప్రమోటింగ్ సంస్థ ఐల్యాబ్స్ ప్రమోటింగ్, ప్రముఖ ఏంజిల్ ఇన్వెస్టర్ చింతలపాటి శ్రీనివాసరాజు (శ్నీనిరాజు) పేర్లను కూడా ఈనెల తొలినాళ్లలో నమోదు చేసిన ఛార్జిషీటులో చేర్చింది.
దీంతో ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు, శ్రీనిరాజుతోపాటు మరో 13మంది... వారికి చెందిన కొన్ని సంస్థల కుంభకోణం సమయంలో దాదాపు రూ.2000 కోట్లుకుపైగా సంపాదించారని నియంత్రణ మండలి పేర్కొంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే.. ఈ సత్యం స్కాంలో నిందితులుగా పరిగణించబడుతున్న అందరికీ సత్యం ఆర్థిక పరిస్థితి ముందునుంచే తెలుసు! అయినా కూడా వీరు మౌనం పాటిస్తూ.. క్రమంగా తమ వాటా షేర్లను విక్రయించి భారీగా లాభపడ్డారని చార్జిషీట్లో దాఖలైంది. ఒకవేళ ఈ ఆరోపణలు గనుక నిజమైతే మాత్రం వీరందరికి గరిష్టంగా పదేళ్లవరకు జైలుశిక్ష పడే అవకాశం వుంది.
రామలింగరాజు తోడల్లుడైన శ్రీనిరాజు 2003కు ముందు సత్యం బోర్డు సభ్యునిగా వున్నారు. దీంతో ఈ స్కాంలో సెబీ ఈయన పేరును ఏ11గా పేర్కంది. అలాగే ఆయనకు చెందిన సంస్థల చింతలపాటి హోల్డింగ్స్ ను ఏ12గా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ను ఏ13గా చేర్చింది. శ్రీనిరాజు శ్రీనిరాజు, ఆయనకు చెందిన కంపెనీలు కలిసి ఈ సమయంలో సత్యంకు చెందిన 73 లక్షల షేర్లను విక్రయించాయని చార్జిషీటులో తెలిపింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుంభకోణం చోటు చేసుకున్న సమయంలోనే శ్రీనిరాజు తండ్రి దివంగత అంజి రాజు కూడా 2.5 లక్షల సత్యం షేర్లను విక్రయించారని వెల్లడించింది. తద్వారా వచ్చిన నిధుల నుంచే శ్రీనిరాజు టీవీ9 చానల్ను స్థాపించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2004లో టీవీ9 బ్రాండ్నేమ్తో శ్రీనిరాజు తెలుగు న్యూస్ చానెల్ను ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more