Minister devineni uma fire on ys jagan xerox center in nampally

Devineni Uma, minister devineni uma, devineni Fires on YS Jagan, tdp vs yscp, ys jagan xerox center in nampally, RBI, RBI and tdp, RBI and ys jagan,

minister devineni uma fire on ys jagan xerox center in nampally: AP Irrigation Minister Devineni Uma Maheshwar Rao expressed serious concern over the crop yield reports being sent to the RBI of India from

నాంపల్లిలో జగన్ దొంగ జిరాక్స్ సెంటర్ !

Posted: 08/10/2014 12:15 PM IST
Minister devineni uma fire on ys jagan xerox center in nampally

నాంపల్లిలో వైఎస్ జగన్ కు దొంగ జిరాక్స్ సెంటర్ ఉందని, అక్కడ నుండి ఆర్బీఐ కి లేఖలు, దొంగ ఫాక్స్ లు పంపుతున్నారని తెలుగు దేశం నాయకులు అంటున్నారు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కు వైసీపీ దొంగలేఖలు పంపిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీనీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

రాష్ట్రంలోని రైతులు చాలా బాగున్నారని... కొన్నేళ్లగా వారికి వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు రాలేదని ఆర్బీఐకి అబద్ధపు లేఖలు పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగున్నాయని... కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటూ... వాటి నకళ్లను జగన్ నాంపల్లి లోని ఓ జిరాక్స్ కేంద్రం నుంచి ఆర్బీఐకు ఫ్యాక్స్ లు పంపారని దేవినేని ఉమ ఆరోపించారు.

రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయాన్ని అమలు చేస్తోండడం చూసి తట్టుకోలేకే జగన్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. జగన్ దొంగతనంగా ఆర్బీఐకు లేఖలు పంపాల్సిన అవసరం లేదని... డైరక్ట్ గా సాక్షి టీవీ, పేపర్ ద్వారా పంపొచ్చని ఆయన ఎద్దేవా చేశారు. 

అయితే ఈవిషయం లో ఎంత నిజం ఉందో, అనేది కొద్ది రోజుల్లో తెలుస్తోంది. ఎందుకంటే.. రెండు పార్టీల నాయకలు రోడ్డుపై కి మాటల యుద్దం, అవసరమైతే.. కార్యకర్తలు ముష్టి యుద్దం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి. అప్పుడు దొంగ ఎవరో దోర తెలుస్తోందని రాజకీయ నేతలు అంటున్నారు. ఏమైన జగన్ , చంద్రబాబుల మద్య వివాదం రోజు రోజు కు ముదురుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles