తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ప్రెస్ మీట్ లో ఉగ్రనరసింహ అవతారం ఎత్తాడు. హైదరాబాద్ లో ఉన్న కబ్జాదారులను ఉక్కు పాదంతో అణిచివేస్తానని మీడియా సాక్షిగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా. అక్రమా నిర్మాణాలను కూల్చుతుంటే., కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారు తెలంగాణలో ఉండి ఇలా అక్రమా ఇళ్లపై ..అడ్డగోలు ఏడుపులు ఏడిస్తే.. చూస్తూ ఊరుకోం.., ఆ ఇళ్లు ఎవరివో నాకు బాగా తెలుసునని మీడియా ముందు ..కేసిఆర్ రెచ్చిపోయారు.
ఇప్పటికే హైదరబాద్ లో ..60వేల ఇళ్లు అక్రమాంగా నిర్మించినట్లు అధికారుల లెక్కలల్లో బయట పడ్డాయి. లాంకో లాంటి దొంగ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని సీఎం కేసిఆర్ ఆవేశంగా అన్నారు. అక్రమాంగా నిర్మించిన ఎవరైన సరే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డుకు, ఇతర సంస్థలకు తగిన పరిహారం ఇస్తాని కేసిఆర్ చెప్పటం జరిగింది.
క రాజకీయ పార్టీ అధినేత ..హైదరాబాద్ ను హైటెక్ హైదరాబాద్ గా చేసేమని .. డప్పు కొట్టుకుంటున్నారు. కానీ ఆయన కళ్లకు.. రాజ్ భవన్, ముఖ్యమంత్రి ఇళ్ల ముందు వర్షం నీరు నిలుస్తున్న విషయం తెలియదా అని కేసిఆర్ ప్రశ్నించారు.నగరంలో ఇలా నీళ్లు ఎందుకు నిలుస్తున్నాయాని ఆరా తీస్తే.. అసలు విషయం అధికారులు వెల్లడించారు. నగరంలో ఉన్న చాలా నాలాలు గత ప్రభుత్వంలో అక్రమాణకు గురికావటంతోనే.. ఇలా నీళ్లు నిలబడుతున్నాయని ..నిజాన్ని నిర్భయంగా అధికారులు కేసిఆర్ కు చెప్పటం జరిగింది.
అందుకే హైదరాబాద్ లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపించిన సరే .. వదిలే ప్రసక్తి లేదని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. నగరంలో ఉన్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకొని .. తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని కేసిఆర్ హామీ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు ..ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని ..కేసిఆర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more