పోలవరం పై తెలుగు రాష్ట్రాల మద్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే పోలవరంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ , పోలవరం బిల్లు అడ్డుకొనే వారికి వార్నింగ్ ఇచ్చారు. పోలవరం జోలికి వెళితే తాటతీస్తాం? అని ఘాటుగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీరు అమలు చేయాలని జైరాం రమేష్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు (పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో విలీనం)పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న జైరాం రమేష్ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తటస్థంగా మాట్లాడారు. ఏడు ముంపు మండలాల ప్రజల భయాలను తొలగించాల్సినసవరం ఉందని, ఈ ముంపు మండలాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం పునరావసం కల్పిస్తుందన్నారు.
పోలవరం డిజైన్ మార్చడం కష్టమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. 28 ఫిబ్రవరి 2014 వెంకయ్య నాయుడు తో దీనిపై మాట్లాడడం జరిగిందని తరువాత మార్చి 1 గెజిట్ అయ్యిందని తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని చదివి వినిపించారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. 7 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని అలాగే 960 మెగావాట్ల విద్యుత్ అందిస్తుందన్నారు. అంతేగాకుండా 23 టిఎంసీల తాగునీరు విశాఖపట్టణానికి అందుతుంది. దీనికి 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా 32 శాతం ఇప్పటికే ఖర్చు చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వల్ల 45 వేల పునరావాసం కల్పించాల్సి ఉంటుందని అంతేగాకుండా మల్కన్ గిరి, ఛత్తీస్ గఢ్ లో ఉన్న ప్రజలకు కూడా పునరావసం కల్పించాల్సి ఉంటుందని సూచించారు. జైరాం రమేష్ ప్రసంగాన్ని పలుమార్లు తెలంగాణ ఎంపీ వీహెచ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనికి డిప్యూటి ఛైర్మన్ కురియన్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కేవలం జైరాం మాట్లాడే అంశాలు రికార్డు అవుతాయని ఇతర మాటలు రికార్డు కావని తేల్చిచెప్పారు.
అయితే జైరాం రమేష్ వార్నింగ్ తో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. టీఆర్ఎస్ నేతల కూడా ఖంగుతిన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్తాయిలో జైరాం రమేష్ మండిపడుతున్నారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన స్ర్కిప్ట్ ప్రకారమే రాజ్యసభలో జైరాం రమేష్ చదివినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి వెనక నుయ్యి, ముందు గొయ్యి అన్న మాదిరిగా మారిపోయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలవరం పై మౌనం పాటించక తప్పలేదు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more