(Image source from: cbi officers questioning governor narasimhan about augusta case)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో స్కాములు, కుంభకోణాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే! అందులో ఏ ఒక్కటి ఇంతవరకు పరిష్కారం అవ్వలేదు! దీంతో ఈ స్కాములపై ఎంత వీలైతే అంత త్వరగా చర్యలు చేపట్టి ముగించాలనే నేపథ్యంలో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.
అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపటిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో ఎవరైతే సభ్యులుగా పాల్గొన్నారో వారందరినీ ఒక్కొక్కరుగా సీబీఐ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమ బెంగాల్, గోవా గవర్నర్లను సీబీఐ విచారించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇద్దరూ గవర్నర్లు రాజీనామా కూడా ఇచ్చేశారు.
ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ను సీబీఐ అధికారులు రాజ్ భవన్ లో ప్రశ్నించారు. గతంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ సందర్భంలో ఐబీ చీఫ్ గా వ్యవహరించిన ఆయన... ఎమైనా సాక్ష్యాధారాలు లభిస్తాయోనన్న కోణంలో సీబీఐవారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చివరగా ఈ కుంభకోణంలో నరసింహన్ ను ఓ సాక్షిగా విచారిస్తూ.. ఆయన వాంగ్మాలాన్ని నమోదు చేసుకున్నారు.
గతంలో కూడా జగన్ కేసులో కొందరిని సాక్షిగా వాంగ్మూలాలను సేకరించిన సీబీఐ అధికారులు... ఆ తరువాత వారిని జైలులో ఊసలు లెక్కబెట్టేలా చేశారు. ప్రస్తుతం నరసింహన్ ను ప్రశ్నిస్తున్న తరుణంలో సాక్షిగా పేర్కొన్న సీబీఐ.. తరువాత ఈయన్ను కూడా జైల్లో వేసి కుమ్మేస్తారేమోనన్న అభిప్రాయాన్ని ప్రతిఒక్కరు వెల్లడిస్తున్నారు. పాపం గవర్నర్... ఈయన భవిష్యత్తు ఏమవుతుందో..?
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more