(Image source from: India get illitery record in the worldwife by unesco)
మన భారతదేశానికి అప్పుడప్పుడు కొన్ని అరుదైన గౌరవాలు దక్కుతాయి. అవి కూడా చెప్పుకోదగినవి కావు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా కొన్ని పరమచెత్త గౌరవాలు దక్కుతుంటాయి. ఇప్పుటికే భారతదేశం ఎయిడ్స్ లో రెండో స్థానంలో, శుభ్రతలో 87వ స్థానంలో వుండగా... ఇప్పుడు మరో చెత్త గౌరవాన్ని మూటగట్టుకుంది.
యునెస్కో సంస్థ నిర్వహించే ఎడ్యుకేషన్ ఫల్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా 2015వ సంవత్సరంలో వెల్లడించిన నివేదిక ప్రకారం... ప్రపంచంలోనే భారతదేశం నిరక్షరాస్యత శాతం ఎక్కువగా వుందని తేల్చిపారేసింది. సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న మన భారతదేశంలో ప్రస్తుతం వెల్లడయిన నివేదిక లెక్కలమేరకు... దాదాపు 14 లక్షలమంది చిన్నారులు బడికి వెళ్లకుండా బయటే అడుక్కుతింగు మగ్గుతున్నారని తేలింది. అదికూడా 6-11 సంవత్సరాల మధ్య వున్న పిల్లలే వుండడం విశేషం!
ప్రతి సంవత్సరం యునెస్కోవారు నిర్వహించే ఈ నివేదికలో యావత్తు ప్రపంచం మొత్తం ఇంకా బడికి వెళ్లని పిల్లలు దాదాపు 5.78 కోట్లుగా వున్నారని తెలుపుతోంది. ఈ నివేదిక గణాంకాల ప్రకారం... ప్రపంచదేశాల్లో నిరక్షరాస్యులుగా ఎక్కువమంది పిల్లలున్న తొలి ఐదు దేశాల జాబితాలో మన భారత్ కూడా ఒకటి. ఇది మన భారత్ పరిస్థితి! ఇదే మన భారతదేశం సాధించిన మరో చెత్త రికార్డ్!
అదే భారతదేశానికి పొరుగునే వున్న నేపాల్ దేశం మాత్రం ఈ విషయంలో చాలా మెరుగ్గా వుంది. మనదేశం కంటే మెరుగైన రీతిలో చర్యలు చేపట్టి... ఏకంగా 99 శాతం మంది పిల్లల్ని బడిలో చదువుకునేలా చేసింది. కేవలం 1 శాతం పిల్లలు మాత్రమే అక్కడే నిరక్షరాస్యులుగా తేలారని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే బురుండి వంటి చిన్న దేశం కూడా 94 శాతం వరకు చిన్నపిల్లలను బడిలో చేరేలా చర్యలు చేపట్టి శెభాష్ అనిపించుకుంది. 2005లో కేవలం 54 శాతం మాత్రమే వెల్లడయిన ఈ లెక్కలు... ఇప్పుడు ఆ దేశం స్కూల్ ఫీజులను ఎత్తివేయడం ద్వారా ఈ విధంగా మంచి ఫలితాలను సాధించగలిగింది యునెస్కో నివేదికలు పేర్కొన్నాయి.
ఇక భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా దాదాపు 10 లక్షలమంది పిల్లలు చదువు అభ్యసించకుండా బయటే తమ కాలాన్ని గడుపుతున్నారని యునెస్కో అధికారులు తెలుపుతున్నారు. ఆయా దేశాల్లో వున్న ప్రభుత్వాలు, రాజకీయనేతలు పిల్లల మీద సరిగ్గా దృష్టి సారించకపోవడం... సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పిల్లలు ఇలా నిరక్షరాస్యులుగా మారుతున్నారని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బోకోవా ఆరోపించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more