ఇటీవలె జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా రాష్ట్రంలో తమ ఘనతను చాటుకోలేకపోయాయి. తెలంగాణా రాష్ట్రం రావడానికి కేసీఆరేనంటూ... ఆ రాష్ట్ర ప్రజలు ఆయనను గెలిపించి, సీఎం పీఠం దక్కేలా చేశారు. కానీ ఇతర పార్టీలు పత్తాలేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ హవా ఎంతమేరకు వుందన్న విషయం మాత్రం ఇంకా లెక్క తేలడం లేదు.
తెలుగుదేశం పార్టీ తన పూర్వ ప్రభావంతో కొంతమేరకు తన స్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో పదిలం చేసుకుంది. ఇక బీజేపీ పార్టీ గురించి చెప్పనవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ గెలవకపోయినా... కేంద్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడంతో దానిని దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఇక మిగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో స్తిరంగా వుంటుందా..? లేదా..? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్... తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. దీనిని బట్టి చూస్తే.. ఈ పార్టీ కూడా తెలంగాణాలో కొంతమేరకు బలమైందేనని, అస్తిత్వం కాదని తెలుస్తోంది. కానీ ఖమ్మంలో మాత్రమే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఈ పార్టీ.. తెలంగాణాలో మరెక్కడా తన ఉనికిని నిరూపించుకోలేని ఈ పార్టీ... ఈ రాష్ట్రంలో మంచి ఘనతను కలిగి వుందని అనుకోవడం ఆలోచించుకోవాల్సిన విషయమే!
ఈ విషయమై కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చినప్పుడు... కొందరు రాజకీయ విశ్లేషకులు తమ మనసులో వున్న భావనలు పలురకాలుగా చెప్పుకుంటున్నారు. తెలంగాణాలో వైఎస్సార్ పార్టీ చాలా బలంగా వుందని కొంతమంది చెబితే... వైఎస్సార్ కి అంత సీనేం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం... వైఎస్ జయంతినాడు ఆ పార్టీ బలమెంతో తేలిపోనుందని అంటున్నారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన జగన్ మోహన్ రెడ్డి... విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్ విగ్రహాలు ఎక్కడైతే వున్నాయో.. వాటన్నిటికీ పాలాభిషేకం, వరుణయాగాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్టు ఆయన, పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న మెదులుతోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అమలు చేస్తారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహిస్తారా..? అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జరిగినా.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులున్న ఖమ్మం ప్రాంతంలో మాత్రమే కొంతమేరకే జరగవచ్చునని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ వైఎస్సార్ జయంతి సందర్భంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమేరకు వుందో తేలనుందని ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ రాష్ట్ర పరిధిలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణా ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందా..? అనే ప్రశ్నలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహించుకుందే మంచిదని... అలాకాని పక్షంలో పార్టీ పత్తాలేకుండా పోతుందని ప్రతిఒక్కరు అభిప్రాయపడుతున్నారు.
మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాలో ఏమేరకు చర్యలు చేపట్టనుందో... కార్యక్రమాలను ఎక్కడ నిర్వహించనుందో ఇంతవరకు బయటపెట్టలేదు. ఏదేమైనా వైఎస్సార్ జయంతి తరువాత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ బలం తెలంగాణాలో ఏమేరకు వుంటుందో అందరు వెయిట్ చేస్తున్నారు!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more