(Image source from: digvijay siingh fasting for farmers in madhya pradesh)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీలో వున్న కొంతమంది నాయకుల కామకథలు బయటపడిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా వారిలో దిగ్విజయ్ సింగ్ గారి కామకథ చాలా విచిత్రమైనది. తనకంటే 25 సంవత్సరాల చిన్నది అయిన టీవీ యాంకర్ తో నడిపిన ఘాటు ప్రేమకథ యావత్తు భారతదేశాన్నే షాక్ కు గురిచేసింది. ఇది జరిగిపోయిన కథ!
తాజాగా డిగ్గీరాజా పార్టీ బలోపేతం కోసం తిరిగి కొన్ని ప్రత్యేకమైన ట్రిక్కులు ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు మీడియాకంట పడకుండా కొన్నాళ్లవరకు కనుమరుగైన డిగ్గీరాజా.. ఇప్పుడు హఠాత్తుగా రైతుల కోసం నిరసన దీక్షలు ప్రారంభించారు. అవును... మీరు వింటున్నది నిజమే..! 67ఏళ్ల ముసలివాడు రైతుల కోసం నిరాహారదీక్ష చేయడానికి సిద్ధపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన దిగ్విజయ్ సింగ్... తన సొంత రాష్ట్రంలో వున్న రైతులకు నష్టం కలిగిందని, వారికి జరిగిన నష్టపరిహారం కోసం పోరాడుతానంటూ ముందుకు వచ్చారు. మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం నుంచి వారంరోజుల వరకు నిరాహార దీక్ష చేయనున్నారని సమాచారం! ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. మధ్యప్రదేశ్ లో వున్న బీపేజీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎన్టీయే ప్రభుత్వం విఫలమైందని నిరసనగా డిగ్గీరాజా దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇంతవరకు ఎన్టీయే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని... ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి మోసపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయితే గతంలో అధికారం వున్నప్పుడు రైతుల సంక్షేమానికి అవసరమయ్యే పథకాలను దిగ్విజయ్ ఎందుకు అమలు చేయలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈయన మీద ఘాటుగానే స్పందించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more