తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్ బీఐ నుండి గట్టి షాక్ తగిలింది. దీంతో కేసిఆర్ సర్కార్ అయోమయంలో పడింది. తెలంగాణలో రైతులు తీసుకున్న పంట రుణాల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధి ఇప్పుడు పెనుభారంగా మారింది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసిఆర్ సర్కారుకు ఆర్బీఐ నుంచి గట్టి షాక్ తగిలింది. రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది.
రుణ మాఫీ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, బ్యాంకులను భాగస్వాములను చేయరాదని స్పష్టంచేసింది. రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రీ షెడ్యూల్ జరిగితే తెలంగాణ రాష్ర్టంలో గత ఏడాది విపత్తుల భారిన పడ్డ 343 మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన బృందం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ని కలిసి రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇందుకు అధికారులు రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు సమాచారం. మాఫీ మొత్తాన్ని ఆరేడు సంవత్సరాల్లో వడ్డీ సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆర్బీఐ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యల కారణంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయని ఆర్బీఐ గవర్నర్ రఘురాం వ్యాఖ్యానించినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more