(Image source from: ysr congress party double games on zptc elections)
తాము చేసే పనులు మంచివి... ఇతరులు చేసేవి అపచారమన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయపార్టీల్లో సందర్భాలను బట్టి శత్రువులు, స్నేహితులుగా.. స్నేహితులు శత్రవులుగా మారిపోతారు. మొన్నటివరకు మానుంచి అన్నీ సహాయసహకారాలు అందిస్తామని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం స్థానిక సంస్థలకు, పురపాలకులకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పురపాలక ఎన్నికలు గురువారంతో పూర్తికాగా... మండల, జడ్పీలకు ఇంకా జరగాల్ని వుంది. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రతినిధులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు బేరసారాలు ఆడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పాలక ప్రతిపక్షాలు అనే తేడా ఏమీ లేకుండా అవకాశం వున్న ప్రతిఒక్కచోట పార్టీలు బేరసారాలకు పాల్పడుతున్నాయి. సహజంగా అధికారం వున్న పార్టీకే ఎక్కువ అడ్వాంటేజీ వుంటుంది గనుక... టీడీపీ అభ్యర్థులు ఎక్కువ చోట్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్లను ఆకట్టుకుంటే... మరికొన్నిచోట్ల వైకాపా, తెదేపా వారిని ఆకట్టుకోవడంలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే... మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియా సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీలు ఓట్లు వేయడాన్ని వైకాపా మాత్రం బాగా వాడేసుకుంది. వారి ఓట్లవల్ల వైకాపాకు కొన్నిచోట్ల అడ్వాంటేజ్ వుండటం వల్ల వారు అలా చేశారు. అయితే మండల జడ్పీ ఎన్నికలకు మాత్రం.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్అఫీషియా సభ్యులుగా ఓటింగ్ అవకాశం ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేస్తోంది. వీరు ఎన్నికలను ప్రభావితం చేస్తారంటూ వైకాపా ఆరోపణలు చేస్తోంది. తాము గెలిచే అవకాశం వున్నప్పటికీ.. ఈ విధంగా కుంటిసాకులు వేయడానికి గల కారణాలు మాత్రం అర్థం కావడం లేదు. దీనిపై కొందరు నేతలు.. వైకాపాకు గెలిచే అవకాశం వున్నా మునిసిపల్ ఎన్నికల్లో ఒక నీతి, ఓడే చాన్సున్న జడ్పీ ఎన్నికల్లో ఇంకో నీతి పాటించే వక్రబుద్ధులు వైకాపా సాధ్యమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more