‘‘గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే.. భుజాలు తడుముకున్నట్లు..’’ తెలంగాణ రాష్ట్రం నీటి పారుదాల శాఖ మంత్రి తీరు ఉందని రాజభవన్ లోని ఉద్యోగులు అంటున్నారు. రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు . సచివాలయాల మద్య వేసిన ఇనుపకంచె ఏర్పాటు ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న తెలంగాణ సర్కార్ .. వెంటనే.. నాలుక మడతపెట్టి, గీ కంచె పని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాలనలోనే కంచె పడిందని . మీడియా ముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేశంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల మధ్య ఇనుపకంచె ఏర్పాటు నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిది కాదని, అది గవర్నర్ తీసుకున్న నిర్ణయమని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల సచివాలయాల మధ్య ఇనుపకంచె వేసి మనుషుల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన భవనాల మధ్య కంచె నిర్మాణం విషయంలో గవర్నరుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ చెప్పడం వల్లనే కంచె నిర్మించినట్లు వస్తున్న వార్తలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. అలా చేయమని గవర్నర్ ఆదేశించలేదని స్పష్టం చేశాయి. దీంతో మంత్రి హారీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో నిజం అనేది కొంచెం కూడా కనిపించలేదని ఇరుప్రాంతాల ఉద్యోగులు అంటున్నారు. మరీ కంచె వివాదం ఎటు పోతుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more