తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు .. తెలంగాణ వాదులు సెగ తాకింది. అంటే రజనీకాంత్ నటిస్తున్న లింగా సినిమా షూటింగ్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అనాజ్పూర్ సమీపంలో... రజనీకాంత్ 'లింగా' సినిమా షూటింగ్ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు.
అవును తెలంగాణ ఉద్యమాలు అయిన తరువాత తెలంగాణ ప్రజలు సినిమా షూటింగులను ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలోని చెవురుల మీద దృష్టి పెట్టి, వాటిపై కొంచెం శ్రద్ద చూపించండని తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చారు. అందులో భాగంగానే.. తెలంగాణ ప్రజలు చెరువులను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలో షూటింగులను అడ్డుకోవటం జరిగిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
అయితే సినిమా షూటింగుల వల్ల చెరువుల ఎం నష్టం జరుగుతుందని చాలా ప్రశ్నిస్తున్నారు.? కానీ షూటింగ్ వల్ల చెరువులో రసాయన పదార్ధాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులో నీరు కలుషితమవుతుందని.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు.
మరోవైపు షూటింగ్ జరుపుకునేందుకు ఇరిగేషన్, గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నామని సినిమా సిబ్బంది చెప్తున్నారు. కాగా అంతకు ముందు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి షూటింగ్ ను అడ్డకుంటామని అనాజ్ పూర్ గ్రామస్తులు యత్నించిన విషయం తెలిసిందే.
కొసమెరుపు: తెలంగాణ ప్రాంతంలో షూటింగులు ఎందుకు జరపారని చాలా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ షూటింగ్ పెట్టుకుంటే.. అక్కడ స్థానికులు అడ్డుకుంటారు. అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కొత్త ప్రదేశాల్లోకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటామని సినిమా పెద్దలు అంటున్నారు. ఇక కేసిఆర్ సర్కార్ సినిమా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more