అక్రమ నిర్మాణాలంటూ నగరాలలో కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని కూల్చివేసే అగత్యం ఎందుకు కలుగుతుందసలు? అక్రమ నిర్మాణాలే అయితే వాటికి అనుమతులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఎందుకు కలిగిస్తారు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేరు.
ఎందుకంటే ప్రభుత్వాలు మారగానే పద్ధతులు మారిపోతాయి! అంతకు ముందు ప్రభుత్వం తప్పు అన్నది ఇప్పుడు ఒప్పవచ్చు, అప్పుడు ఒప్పు అన్నది ఇప్పుడు తప్పవచ్చు!
అక్రమ నిర్మాణాలు ఉండగూడదన్నది నిజమే కానీ వాటిని మొగ్గలోనే తుంచకుండా ఉపేక్షించి, ఉపేక్షించి, తీరా అది పైకి లేచి, ధరలు పెరిగి, చేతులు మారిని తర్వాత తప్పు అనటం ఎంతవరకు సబబు? దీనివలన ఎంతమంది అమాయకులు బలైపోతున్నారు. ఒక ఇల్లు కట్టటమంటే సామాన్యుడికి సులభమైన విషయమా? తీరా అప్పోసప్పో చేసి ఇల్లు నిలబెట్టుకుంటే అది అక్రమం అంటూ కూలగొట్టటం ప్రజాహితమా?
నిర్మాణాలు గాలిలో లేవవు కదా! స్థానికంగా ఉండే అధికారులు ఏం చేస్తారు? అక్రమ నిర్మాణాలు పైకి లేస్తుంటే చూసుకుంటూ ఎలా ఉండిపోతారు? అంటే ఆ సమయంలో వస్తున్న అవినీతి సొమ్ముకు ఆశపడి మిన్నకుంటారు! కానీ తీరా పై అధికారులు లేదా ప్రభుత్వం కన్నెర్ర చేసేసరికి ఆ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పక్షం మాట్లాడుతారు. అక్రమనిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావని సంబంధిత అధికారులనెందుకు నిలదీయరు?
ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలనే కాదు, దేశం మొత్తంలో జరుగుతున్నదిదే! అక్రమ నిర్మాణమే అయితే వెంటనే ఎందుకు కూల్చివేయరు? అది పూర్తై అమ్మకాలు కొనుగోళ్ళు జరిగేంతవరకు వేచి చూసి, అందులో సామాన్యుడు నివసిస్తుంటే అప్పడు తెలుస్తుందా అది అక్రమ నిర్మాణమని?
మందుల దుకాణంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ మీదనే మందుల అమ్మకం చేసినట్లుగా సిమెంట్, స్టీల్ కొనుగోళ్ళ సమయం నుంచే నియంత్రణనెందుకు పాటించగూడదు? ప్రతి సిమెంట్, స్టీల్ అమ్మకాల మీద నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలు పొందుపరచి ఎప్పటి కప్పుడు అధికారులకా వివరాలను అందిస్తే, జరుగుతున్నది అక్రమ నిర్మాణమే అయితే అప్పుడే పట్టుబడదా? రూ.50000 కి దాటిన వినియోగదారుల లావాదేవీలను బ్యాంక్ నుంచి ఆదాయ పన్ను శాఖకు చేరినట్లుగా, తలచుకుంటే అధిక ప్రమాణంలో జరిగే క్రయవిక్రాయాల స్థాయిలోనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయవచ్చు.
అప్పుడు కొనుగోలు దారుడు, మౌలిక సదుపాయాలనున్నాయీ అంటే చట్టబద్ధమైందన్న నమ్మకంతో కొనుగోలు చేసుకోగలుగుతాడు. భూకబ్జా జరిగితే ఎక్కువగా దానిలో నష్టపోయేది నిజంగా కబ్జా చేసినవాళ్ళే కాదు, వాళ్ళు ఆ ప్రాపర్టీని చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి అమ్మితే కొనుగోలు చేసిన వాళ్ళది. అదెవరూ అంటే మధ్యతరగతివాళ్ళు! అక్రమంగా నిర్మాణం చేసినవాళ్ళు డబ్బు చేసుకుని ఉడాయించేంత వరకు ఏ అధికారులూ మాట్లాడకపోవటం వలనే ఇవి జరుగుతున్నాయి.
చట్టంలో కొన్ని లొసుగులున్నమాట నిజమే. దొంగ వస్తువు దొరికినప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నవారిని పట్టుకోవటమే కాకుండా ఆ వస్తువును జప్తు చెయ్యటం కూడా జరుగుతుంది. అలాగే నిర్మాణం అక్రమంగా జరిగిందీ అంటే అది ఎప్పుడు జరిగిందన్నది చట్టం పట్టించుకోదు. అక్రమంగా జరిగిన నిర్మాణమా, అయితే దాన్ని కూల్చివెయ్యండి అన్నదే చెప్పటం జరుగుతుంది.
ఇప్పటికైనా, మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలని, అలా జరగకపోతే సంబంధిత అధికారుల మీదనే ముందుగా చర్య తీసుకోవాలనే నియమం ఉన్నట్లయితే అక్రమ నిర్మాణాలు జరిగేంత వరకు సినిమా చూసినట్లు చూస్తూ ఊరుకోరు. విద్యుత్, నీటి సరఫరా చెయ్యటమనేది జరగదు. ఆ తర్వాత కరెంట్ కట్ చెయ్యటం కాదు ముందు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న వెయ్యాలి! ఆటో రోడ్డు మీద తిరుగుతుందీ అంటే అందుకు అవసరమైన అనుమతులూ, నడిపే మనిషికి లైసెన్స్ ఉందనే అందులో ఎక్కుతారు. అంతేకానీ ఆటో నడిపే మనిషిని నీ లైసెన్స్ చూపించు, నీ బండి పేపర్లు చూపించమని అడగరు.
సరైన నియమావళిని రూపొందించినట్లయితే అక్రమమైన కట్టడాలు ఉండవు, నష్టపోయే సామాన్యులూ ఉండరు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more