మనం భారతీయలం, ప్రాంతాలు వేరైన మన భారతమాత ముద్దు బిడ్డలం. 29 రాష్ట్రాలు కలిగిన భారత్. బిన్న జాతులు, విభిన్న సంప్రాదాలు కలిగి, అందరు కలిసిమెలిసి ఉండటం భారతీయుల నైజం. ‘‘అప్పుడేప్పుడో.. బ్రిటిషోళ్లు.. భారతీయులు నల్లజాతీయులగా పరిగణించి, మన స్వాతంత్ర పితమహుడైన.. గాందీ గారిని రైలు నుండి తోసేసిన విషయం భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి తెలిసిందే. అలా గాంధీగారిని రైలు నుండి తొసినందుకు .. తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఇలాంటి సంఘటనే.. మనదేశంలో జరిగింది. ఈ సారి పరాయి దేశీయులు కాదు, పక్క రాష్ట్రాల వారే.. మరో రాష్ట్ర ప్రజలపై అతికిరతంగా వ్యవహరించారు.
ఇప్పుడు మన దేశంలో భాషపరంగా రాష్ట్రాలు ఏర్పాడుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, మలయళం, పంజాబీ, లాంటీ బాషలు దేశంలో బాగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడు బాషపరంగా కొట్టుకోవటానికి కొన్ని రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ఒక బాష పై మరో బాష వారు కక్ష పెంచుకోని ప్రతీకార చర్యలకు పునుకుంటున్నారు. దేశం మొత్తం మీద ఇప్పుడు తెలుగు బాష అన్న, తెలుగు వారు అన్న చాలా చులకన భావం ఏర్పడింది. దీంతో తెలుగు వారిని బానిసల కంటే హీనంగా చూసే దోరణి కనిపిస్తుంది. ఇలాంటి తీరు బీహారీలు తెలుగు వారి పై చూపించారు.
500 మంది తెలుగు వారి దైవభక్తితో కాశీయాత్రకు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో వారికి వారణాసిలో రైల్వే స్టేషన్లో ఎవరు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వారణాసిలో పాట్నా-సికింద్రాబాద్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా బీహారీలు వారిపై దౌర్జన్యం చేసి సీట్లను ఆక్రమించారు. అంతేగాకుండా, వారందరినీ రైలు నుంచి తొసేసారు. (గెంటివేశారు) . ఆ 500 మంది తెలుగు వారు మేము రిజర్వేషన్ చేసుకున్నామని చెప్పినా వారి గోడు పట్టించుకున్న నాథుడేలేడు కదా.. అతిక్రూరంగా తెలుగు వారిని రైల్వే ప్లాట్ పామ్ మీద కు నెట్టేశారు. వీరిలో చిన్నపిల్లలు, పెద్ద వయసు కలిగిన వారు ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా వారి లాగేజ్ ను కూడా ఇవ్వకుండా రైలు బోగీ నుండి బయటకు నెట్టేశారు. అయితే ప్రస్తుతం వారణాసిలో 500 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. ఈ 500 మంది తెలుగు వారు ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే ఈవిషయాన్ని వారణాసిలోని రైల్వే అధికారులు చెప్పిన తమను పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు.
ఆంద్రప్రభుత్వం అయిన పట్టించుకోని .. మాకు సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం వెంటనే స్పందించి తగ్గు చర్యలు తీసుకోవాలని ఆంద్రప్రదేశ్ అధికారులను , మీడియా వారిని కోరుతున్నారు.
ఇలాంటి దాడుల వల్ల దేశం పరువు పోతుంది, ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ప్రజలు కక్షలు పెంచుకోని ఘోరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఫోలీస్ అధికారులు అంటున్నారు. ఇలాంటి పరిణామలు వల్ల ఉగ్రవాదులకు బాగా కలిసి వచ్చే ఛాన్స్ ఉందని రిటైర్ అయిన ఉన్నత అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more