ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 19 వ తేదీ గురువారం ఉదయం 8.00 గంటలకు అధికారిక ముఖ్యమంత్రి కార్యాలయమైన లేక్ వ్యూ అతిథిగృహం లో బాధ్యతలు చేపట్టనున్నారు. అదే రోజు నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ లోపులోనే మంత్రులను బాధ్యతలలోకి వెళ్ళమని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటంతో ఆదివారం ఇద్దరు మంత్రులు బాధ్యతలను చేపట్టారు. మిగిలిన 17 మంది మంత్రులు సోమవారం నుండి బుధవారం వరకు తమ తమ మంత్రిత్వ బాధ్యతలను చేపడతారు.
గురువారం లేక్ వ్యూలో 8.00 నుంచి 9.00 గంటల వరకు అవసరమైన దస్త్రాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. సోమ, మంగళ వారాల్లో చంద్రబాబు తన నియోజక వర్గానికి వెళ్ళి, తనను గెలిపించిన వోటర్లకు కృతజ్ఞతలు తెలియజేసే సభలో పాల్గొననున్నారు.
25, 26 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక లోటు విషయంలో చర్చలు సాగిస్తారు. అలాగే ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రతిపత్తికి అర్హతలు లేవని చెప్పిన నేపథ్యంలో నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాని అమలు కోసం కూడా చంద్రబాబు మాట్లాడనున్నారు.
20 వ తేదీన సభాపతి, ఉపసభాపతి ఎన్నికలు జరుగనున్నాయి. 21 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవరన్న ఇఎస్ఎల్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత రెండు రోజులు శాసనసభలో గవర్నర్ ఉపన్యాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలుంటాయి. చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభలో సభ్యులను సంబోధింఛి మాట్లాడుతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more