దేశంలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వివిధ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలకు చెక్ పెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యాచార ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనన విషయంలో తర్జనభర్జనలు, మానసిక దౌర్బల్యాల గురించిన విశ్లేషణను నిలిపివేయమని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని బదాఁవు గ్రామంలో ఇద్దరు బాలికల మీద జరిగిన అత్యాచారం మీద భారతీయ జనతా పార్టీతో సహా వివిధ పార్టీ నాయకులు గత మూడు రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు. అనుకోకుండా ఒక్కోసారి రేప్ లు జరుగుతాయని రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యానాల వలన సమస్య తీరదు సరికదా ప్రజాగ్రహానికి గురౌతారని అన్నారాయన. ఆడవారి గౌరవానికి మరింత భంగం కలిగించే బదులు అటువంటి సంఘటనల మీద వాదోపవాదాలు చేసుకునే బదులు మనం మిన్నకుండటమే మంచిది అన్నారు మోదీ. ఆ సంఘటనల ఆధారంగా లోతుగా ఆలోచించటమే మనం చెయ్యవలసిన పని అని అన్నారాయన.
మహిళలతో పాటు మైనార్టీ వర్గాల పరిరక్షణ విషయంలో కూడా మోదీ తన ఆవేదనను వెల్లడించారు. పూణె లో పోయిన నెలలో ఒక ముస్లిం యువకుడిని మరో వర్గానికి చెందిన బృందం కొట్టి చంపటం లాంటి ఘటనలను కూడా పునరావృతం కాకుండా చూడాలన్నారు మోదీ. ఛత్రపతి శివాజీ, శివసేన నాయకుడు బాల్ థాకరే బొమ్మలను వికృతీకరించి పంపిణీ చెయ్యటం జరిగింది. ఆ విషయంలో పై ఘటన చోటుచేసుకుంది.
తన చిన్నప్పుడు ఒక ముస్లిం యువకుడిని సైకిల్ రిపేర్ చేసుకుంటూ బ్రతుకును వెళ్ళదీయటం తాను చూసానని, ఇప్పుడు అతని కొడుకు కూడా అదే పనిలో ఉన్నాడు కానీ ఆర్థికంగా ఎదగలేదని, అలా ఎందుకు జరుగుతోంది, ప్రభుత్వం ఉన్నది ఉన్నవాళ్ళకోసమేనా, లేని వాళ్ళకోసం కాదా అన్నారు మోదీ.
రాష్ట్రాలలో అభివృద్ధి చాలా ముఖ్యమని, యువతలో ఉపాధికి కావలసిన విద్య, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యటం అత్యంత అవసరమని మోదీ అన్నారు. యువత క్రియాశీలకంగా మారితే అత్యాచారాలు అంతమవుతాయన్నది మోదీ భావన కాని ఆ విషయాన్ని ఆయన స్పష్టీకరించలేదు.
లోక్ సభలో బుధవారం సుదీర్ఘంగా ఉపన్యసించిన ప్రధాన మంత్రి మోదీ పై విషయాలను సూచించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more