అరచేతిలో.. అర్థ చంద్రమామను చూపించేది ఎవరయ్యా అంటే.. మన చిత్తూరు చంద్రాలు అని అందురు చెబుతారు. నారా వారి ఇంట మెరిసిన ఆణిముత్యం మన చంద్రబాబు గారు. తెలుగు ప్రజలకు సేవ చెయ్యలనే ఆలోచనే మూడో సారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాయి. ఈ హామీల చంద్రుడు , ఆంద్రప్రదేశ్ ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది.
చిత్తూరు సార్ ఇచ్చిన హామీలపై ఇప్పుడు విమర్శలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టే రోజే పంచ సంతకాలు చేసి సంచలనం స్రుష్టించారు మన చంద్రం సారు. ఆయన చేసిన పంచ సూత్రాలే ..ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. గతంలో ఉద్యోగుల వల్లే ..తనకు చంద్రగ్రహనం పట్టిందని గ్రహించిన చంద్రబాబు .. పదవి చేపట్టిన వెంటనే.. ఆంద్రప్రదేశ్ ఉద్యోగులకు 60 పై ఆశలు కలిగించారు. దీంతో ఉద్యోగులు ...చంకలు గుద్దుకొని, సంబరాలు చేసుకున్నారు.
కానీ వారి ఆనందం ఇంత త్వరంగా ప్రమాదంలో పడుతుందని చిత్తురు సార్ ముందుగా గ్రహించలేకపోయాడు. దీంతో ఇపుడు, తెలంగాణ ఉద్యోగులు, ఆంద్రప్రదేశ్ ఉద్యోగులు అనే బేధం తో.. బాబు కు కొత్త నొప్పులు వచ్చాయి. దీంతో ఉద్యోగులు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు. ఉమ్మడిగా ఉన్న ఉద్యోగులను రెండుగా విడగొట్టి, పని అప్పజెప్పారు కేంద్రం వారు. దీంతో ఆంద్రలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు పని చేసే విధంగా కేంద్రం కొన్నిషరతులు పెట్టింది.
దీంతో ఉద్యోగుల్లో చంద్రబాబు 60 ప్రకంపనలు స్రుష్టించింది. చంద్రబాబు ప్రకటించిన ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపు కొత్తగా సాంకేతిక చిక్కులు తెచ్చిపెడుతోంది. నేరుగా తెలంగాణ ఉద్యోగులకూ దీన్ని వర్తింప చేయాల్సిన సాంకేతిక చిక్కు తలెత్తవచ్చని అధికారులు చెబుతుంటే, అసలు పదవీ విరమణ పరిమితి అమలు నేరుగా చంద్రబాబు చేతుల్లో ఉంటుందా! అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
దీనిపై అధికారులు, నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల్లో కూడా ఇదే ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా, జోన్, మల్టీజోన్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో వారిని ఆ రాష్ట్రానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక సచివాలయం, రాజధానిలోని వివిధ శాఖల ప్రధాన శాఖల్లో పనిచేస్తున్న వారిలో సుమారు 9800 మంది ఉద్యోగులను ‘ఆర్డర్ టు సర్వ్’ మేరకు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. మిగిలిన వారంతా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇక పూర్తిస్థాయి పంపకాలను త్వరలోనే కేంద్రం నిర్వహించాల్సి ఉంటుంది.
దీనికోసం మార్గదర్శకాలు కూడా తయారు చేసే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ పూర్తి పంపకాలు అయ్యేంతవరకూ ఇరు రాష్ట్రాల స్టేట్ కాడర్ ఉద్యోగులంతా కేంద్ర డివోపీటి విభాగం ఆధీనంలోనే ఉంటారు. అది కనీసం ఐదారు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు వారికి పదోన్నతులు కల్పించడం, బదిలీలు నిర్వహించడం కూడా సాధ్యం కాదు.
తుది పంపకాలు జరిగిన తరువాత ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఈ పరిస్థితుల్లో 60 ఏళ్లకు ఉద్యోగుల పదవీ కాల పరిమితి పెంచడం ఎంతవరకు సాంకేతికంగా సాధ్యమని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అసలు పూర్తిస్థాయి పంపకాలు జరిగేంతవరకు 60 ఏళ్ల విధానం అమలు సాధ్యంకాదనే భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేంద్రంతో చర్చించి ఎలాగైనా ఈ విధానాన్ని అమలు చేయాలని బాబు భావిస్తే అప్పుడు కూడా కొత్త చిక్కులు తలెత్తే ప్రమాదం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
ఉద్యోగుల తుది విభజన జరిగేంతవరకు తెలంగాణకు కేటాయింపు జరిగిన జిల్లా, జోన్, మల్టీ జోన్ ఉద్యోగులు తప్ప మిగిలిన స్టేట్ కాడర్ ఉద్యోగులు అంతా ఆంధ్రప్రదేశ్కే చెందుతారు. అందులో కొంతమందిని తెలంగాణకు పనిచేయాలని కేంద్రం ఆదేశించగా, దాదాపు 4600 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు పనిచేయాల్సి వస్తోంది. వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగానే చలామణి కానున్నారు.
తాజాగా బాబు 60 ఏళ్ల నిబంధన అమల్లోకి తీసుకొస్తే రాష్ట్ర కాడర్లో ఉన్న తెలంగాణ వారికీ విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు చిత్తురు చంద్రబాబుకు శిరోభారం అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా ఈనెల 30నుంచి కొత్త విధానం అమలు చేయాల్సి ఉంటే మాత్రం అంతకు ముందే తుది పంపకాలు జరిగిపోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పేటట్టు లేదు.
ఈ నేపథ్యంలో కేంద్రం తుది పంపకాలు పూర్తి చేసేంతవరకు చంద్రబాబు తన 60 ఏళ్ల పదవీ విరమణ విధానాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. తరువాతే కొత్త విధానం అమలు చేస్తే సాంకేతిక సమస్యలను కూడా అధిగమించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అంటే కనీసం నాలుగైదు నెలల వరకూ కొత్త ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 60ఏళ్ల విధానం అక్కరకు వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే.
దీంతో చంద్రబాబు .. 60 ప్రమాదంలో పడిందని ఉద్యోగులు అంటున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాల లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబో 60తో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తలపోటు మొదలైంది. తెలంగాణ ఉద్యోగులు సంఘాలు.. సీఎం కేసిఆర్ కు డిమాండ్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more