తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత..ఏదీ చేసిన చాలా డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటుంది. ఇటీవల తను కూర్చునే కూర్చీని ..ఢిల్లీకి తీసుకుపోయి, తన రాచరికం ఏమిటో నిరూపించింది. తమిళనాడు ప్రజలకు ‘అమ్మ’ లా మారింది. ప్రజలు కూడా ..‘‘అమ్మ.. అమ్మా.. మాయమ్మ..అమ్మలు కన్న జయమ్మ’’అని పాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటా అమ్మబ్రాండే ఉండాలనే ఉద్దేశంతో కొత్త పథకం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
జయమ్మ ప్రజల్లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోవటంతో.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నిద్రపట్టడం లేదు. తమిళ ప్రజలకు ‘అమ్మ’ పేరిట ఉప్పు ను పరిచయం చేస్తుంది. తమిళ జయమ్మ. ఉప్పు తో తమిళ ప్రజల మనసు జయమ్మ దోసుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఉప్పు తిన్న విశ్వాసాన్ని ఎవరు మరిచిపోరానే విషయం అందరికి తెలుసు. అందుకే జయమ్మ తమిళ ప్రజలకు అమ్మ ఉప్పు రుచి చూపిస్తుంది.
అమ్మ ఉప్పుతో.. తళమి ప్రజలకు గాలం వేసింది. అంటే తమిళ ప్రజల చేత ఉప్పు తినిపించి, వారి ఓటు హక్కు ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే అమ్మ 5 రూపాయిలకు పుల్ భోజనం తమిళ ప్రజలకు అందిస్తోంది. అమ్మ వాటర్ బాటిల్ కేవలం పది రూపాయలకే దొరుకుతోంది. కాబట్టి వీటికి తోడుగా.. అమ్మ ఉప్పు ను జత చేసినట్లు తెలుస్తోంది.
ఇక కేవలం అతి చౌకధరకు ఉప్పును అందించే విధంగా జయమ్మ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రతి ఇంటిలో అమ్మ బ్రాండ్ తప్పనిసరిగా ఉండే విధంగా... తమిళ నాడులో సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరికే విధంగా తయరు చేసినట్లు తెలుస్తోంది.
కాబట్టి అమ్మ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత(అమ్మ) ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. దీంతో అమ్మ విజయం సులువుగా దక్కుతుందని అమ్మ అభిమానులు చెబుతున్నారు. అమ్మ ఉప్పు తింటే.. ఆరోగ్యానికి, ఆరోగ్యం ఉంటుందని అంటున్నారు.
అమ్మ ఉప్పులో ఉండే రుచే వేరాయా అని తమిళ ప్రజలు చెప్పుకోవాలని జయమ్మ కార్యకర్తలు అంటున్నారు. ఈరోజు ఉప్పు.. రేపు ఏమీ ఇస్తుందోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగారం కూడా తక్కువ ధరకు దొరికే విధంగా అమ్మ ఏర్పాటుచేస్తే బాగుంటుందని తమిళ ప్రజలు కలలుకంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more