ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్లో ఒకటైన రైతు ఋణ మాఫీ సంపూర్ణంగా చేస్తే రూ.40,994 వేల కోట్ల రూపాయలకు లెక్క తేలుతుంది. కానీ లక్షరూపాయల లోపున్న ఋణాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని తీసుకున్న నిర్ణయం వలన ఆ మొత్తం ఇప్పుడు 26,020 కి తేలింది. ఋణ మాఫీ పక్కా అని చెప్పటం వలన రైతులు ఎప్పటి నుంచో వారు తీసుకున్న వ్యవసాయ ఋణాలను చెల్లించటం మానేసారు.
ఈ ఋణ మాఫీ మీద సంతకం చెయ్యటానికి తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఉత్సుకత చూపిస్తున్నారు. కానీ దీని మీద ఇంకా మార్గదర్శకాలు రూపొందించటం మిగిలివుంది. డ్వాక్రా ఋణాల మాఫీకి ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా అధికారులు ఆ గణాంకాలను కూడా కెసిఆర్ కి సమర్పించారు. ఆ ఋణాల మొత్తం 8570 వేల కోట్లయితే, లక్ష లోపులో ఉన్న ఋణాలు అందులో 4100 వేల కోట్లకు తేలాయి. ఈ ఋణాలలో మాఫీలకు పాటించవలసిన విధివిధానాలను ఇంకా నిర్ణయించవలసివుంది.
కెసిఆర్ పదవీ స్వీకారం చేసి ఈరోజు మూడవ రోజే అయినా ఆయన తన హామీలను నిలబెట్టుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం కానున్నారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఋణ మాఫీ ప్రణాళికను సిద్ధం చెయ్యకపోవటంతో వస్తున్న ఇబ్బందుల్లో ఒకటి బ్యాంక్ లు రైతులను ఋణాలను తిరిగి చెల్లించమని వత్తిడి చెయ్యటం జరుగుతోంది. పైగా ఋణ మాఫీ మార్గదర్శకాలు తయారవకపోవటంతో కొత్తగా ఋణాలు ఇవ్వటానికి సంశయిస్తున్నారు. అదీగాక ఋణాలు వసూలు కాకపోతే కొత్త ఋణాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. ఈ విషయాలను జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునివెళ్ళారు. సచివాలయంలో ఆయనను కలవటమే కాకుండా లిఖిత పూర్వకంగా జీవన్ రెడ్డి ఈ సమస్యను త్వరగా పరిష్కరించమని ముఖ్యమంత్రిని కోరారు.
ఈరోజు బ్యాంకర్లతో జరుగనున్న సమావేశంలో కెసిఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా హాజరవుతారు. ఇందులో ఋణమాఫీకి సంబంధించిన అనేక ఆర్థిక అంశాలను చర్చించనున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more