ఈరోజు జరిగిన గోపీనాధ్ ముండే అకాల మరణం దేశంలో ఇంతవరకు జరిగిన ఇటువంటి సంఘటనలను గుర్తుచేస్తోంది. ప్రమాదంలో కాని, దాడిలో కాని, హత్యగావించబడి కాని అకాలమృత్యువు వాతపడిన నాయకులు వీరే-
1975 జనవరి 3- అప్పటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ మిశ్రా చనిపోయారు. అంతకు ముందురోజు సమస్తిపూర్- ముజప్ఫర్ పూర్ బ్రాడ్ గేజ్ ని ఆవిష్కరిస్తున్న సమయంలో జరిగిన బాంబు దాడిలో ఆయన గాయపడివున్నారు.
1980 జూన్ 23- కాంగ్రెస్ ఎంపీ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయంలో విమాన ప్రమాదంలో చనిపోయారు.
1984 అక్టోబర్ 31- ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన సొంత సెక్యూరిటీ గన్ మెన్ ల చేతనే హత్యగావించబడ్డారు.
1991 మే 21- ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపేరుంబూదూరులో ఆత్మాహుతి దళం చేసిన దాడిలో మరణించారు.
1994 డిసెంబర్ 25- భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ నవంబర్ 29 నాడు ఆనందపూర్ సాహిబ్ కి కారులో వెళ్తుండగా రోపార్ జిల్లా కిరాత్ పుర్ సాహిబ్ సమీపంలో ప్రమాదానికి గురై డిసెంబర్ 25 న మృతిచెందారు.
2000- కాంగ్రెస్ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ రాజస్తాన్ లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
2001- మాజీ కాంగ్రెస్ ఎంపీ మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో మరణించారు.
2002 మార్చి 3- లోక్ సభ స్పీకర్ జిఎమ్ సి బాలయోగి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కైకలూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2004- మేఘాలయా క్యాబినెట్ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2005- హర్యానా కాంగ్రెస్ నాయకుడు రణబీర్ సింగ్ మహింద్రా, ఓపి జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2006- భాజపా నాయకుడు మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ ని అతని సోదరుడే కాల్చి చంపాడు.
2006- భాజపా నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి సాహిబ్ సింగ్ వర్మ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
2007- జార్ఘండ్ ముక్తి మోర్చా లోక్ సభ ఎంపీ సునీల్ కుమార్ మహతో జమ్ షెడ్ పూర్ కి 40 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ సింగభూమ్ జిల్లాలోని బకూరియాలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా నక్సల్స్ దాడిలో మరణించారు.
2009 సెప్టెంబర్ 2- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2011- అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2012- తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు ప్రయాణం చేస్తున్న కారు ఆయిల్ టాంకర్ కి ఢీకొనగా ఆయన మరణించారు.
2013- ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్, విసి శుక్లా లను మావోయిస్ట్ లు మాటేసి తుదముట్టించారు.
2014 ఏప్రిల్ 24- వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మల్యే భూమా శోభా నాగిరెడ్డి రోడ్ ప్రమాదంలో మరణించారు.
2014 లోనే ఈ రోజు జూన్ 3న- కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న 8 రోజులకే గోపీనాధ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more