మనదేశంలో ఇదే తొలిసారి ఇలా జరగటం. ఇప్పటి వరకు 13 మంది ప్రదాని మంత్రులుగా పదవి చేపట్టారు. అయితే వారి ప్రమాణ స్వీకారం మాత్రం ఇలా జరగలేదని రాష్ట్రపతి భవన్ లోని ఉన్నత ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్రపతి భవన్లో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలకు 1500నుంచి 2వేలమంది అతిథులు హాజరయ్యారని, తొలిసారిగా 4వేలమంది అతిథులు హాజరవుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మీడియా కార్యదర్శి ఒమితా పాల్ తెలిపారు.
ప్రమాణ కార్యక్రమానికి తొలుత మూడు వేల మంది అతిథులు హాజరవుతారని భావించినా ఆ సంఖ్య నాలుగు వేలకు చేరింది.
రాష్ట్రపతి భవన్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కోరుకుంటారని.. ఈ వేడుకకు భారీగా అతిథులు హాజరవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారని ఒమితా పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో మెరుపులతో కూడిన వర్షం కురవవచ్చన్న వాతావరణ శాఖ నివేదికపై ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమం సజావుగా సాగుతుందని, వర్షం ఆటంకపర్చదని ఆశిస్తున్నాం.
ఒకవేళ ఆ పరిస్థితి వస్తే.. వేదికను దర్బార్హాల్కు మార్చుతాం. అందులో 500మంది కూర్చోవడానికి మరో 400మంది నిల్చుని కార్యక్రమం చూడటానికి అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. అతిథులంతా సాయంత్రం 5 గంటలకే వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు.
నడిచేందుకు ఇబ్బంది పడే అతిథులను ఫోర్కోర్ట్లోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా 12 గుర్రపు బగ్గీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 777 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు పంపామని.. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యవేత్తలు, రాజ్యాంగసంస్థల అధిపతులు, యూపీఏ-2 ప్రభుత్వంలో మంత్రులు, 350మందికిపైగా పాత్రికేయులు కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పా రు.
అతిథులను ఆహ్లాదపర్చేందుకు సైనిక, నౌకా, వాయు బ్యాండ్లు దళాలు దేశభక్తి గీతాలు ఆలపించనున్నాయని.. 4.45నిమిషాలనుంచే వీవీఐపీల రాక, కార్యక్రమంపై వ్యాఖ్యానం ప్రారంభమవుతుందని తెలిపారు. వేదిక వద్ద తక్షణ వైద్య సహాయం కోసం అంబులెన్స్లు, వైద్యులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మన దేశంలో ఇలా జరగటం ఇదే తొలిసారి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more