సార్వత్రిక ఎన్నికలలో అసలే ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ఏం చెయ్యాలో పాలుపోకుండా ఉన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ కి దెబ్బ మీద దెబ్బ లా ఇద్దరు ఎంపీలు పార్టీ వీడి ఆదివారం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడితో కలవటం జరిగింది. వారు నంద్యాల ఎంపీ వైఎస్వీరెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక.
ప్రమాణ స్వీకారం జరగక ముందే తెదేపా ఇంకా బలోపేతమౌతోంది. ఎంపీలిద్దరూ తెదేపాకి మద్దతు తెలపటమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని అన్నారు. వీరిద్దరిలో వైఎస్వీరెడ్డి తెదేపాలో కలవగా రేణుక భర్త నీలకంఠం కూడా తెదేపా ఖండువా కప్పుకున్నారు ఎందుకంటే రేణుక తెదేపా లో సభ్యురాలిగా చేరకుండా అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని అన్నారు.
తెలుగు దేశం పార్టీ ఆ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ముందు స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్వీ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుండటం వలన తన ప్రాంత అభివృద్ధి దృష్ట్యా తెదేపాలో చేరానని అన్నారు. జగన్ తో కానీ వైకాపాలో కాని తనకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, తనకి ప్రజలే ముఖ్యం కాబట్టి వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాను పార్టీ మారటం వలన ఎంపీ పదవి రద్దయిన పక్షంలో తిరిగి పోటీ చేస్తానని తాను గెలవటం మాత్రం ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తంచేసారు.
రేణుక కూడా అదే పంథాలో మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ప్రజలకు కొన్ని హామీలను చేసామని, వాటిని నెరవేర్చే బాధ్యత తన మీద ఉందని, అలా చెయ్యలేనట్లయితే రాజకీయాలలో పనిచెయ్యటానికి అర్థమనేదే ఉండదని అన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీయే అయినా, ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబట్టి పార్టీ సభ్యల మీద అనర్హతను ప్రకటించే హక్కు ఆ పార్టీకి లేదు. దీని ఆధారంగా మరి కొందరు సభ్యులు కూడా తెదేపా లోకి మారతారేమోనన్న భయం ఆ పార్టీని పట్టుకుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more