పార్టీ ఎంపీలను నరేంద్ర మోదీ క్యాబినెట్ లోకి ప్రవేశపెట్టటానికి అవసరమైన చర్చల కోసం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ ప్రయాణమౌతున్నారు. 25న ఆయన మోదీ, ఇతర భాజపా నాయకులతో భేటీ కానున్నారు.
ఎంతమంది ఎంపీలకు మంత్రి పదవులు ఇస్తారన్న సంఖ్యను నిశ్చయం చేసుకోవటానికి ముందుగా చర్చలు జరుపబోతున్నారు. తెదేపాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన భాజపా ఎంపీల విషయంలోకూడా చంద్రబాబు వీలయినన్ని ఎక్కువ మంత్రి పదవులను కూడగట్టాలనే లక్ష్యంతో ఉన్నారు.
మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటానికి ఇంకా రెండు రోజుల వ్యవధే ఉండబట్టి ఈ లోపులో మంత్రి వర్గాన్ని ఎంపిక చెయ్యటమనే ప్రహసనాన్ని పూర్తి చెయ్యవలసివుంది. భాజపా ముందు ప్రస్తుతం ఎన్నో సమస్యలను తీర్చవలసిన అవసరం ఉంది. ఎన్డియే కూటమి సభ్యులు, దేశంలో ఇతర పార్టీలతో వేగుకురావటమే కాకుండా, అంతర్జాతీయంగా ఎన్నో విషయాలను చక్కదిద్దుకు రావలసివుంది.
అయినా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యటం కూడా అవసరమే కాబట్టి దీని మీద ఇప్పటికే పార్టీ పెద్ద తలకాయలు ఒక నిర్ణయానికి వచ్చినట్లే సమాచారం.
ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. వాళ్ళు కాకుండా 6గురు రాజ్యసభ సభ్యులున్నారు. రాజకీయాలలో అనుభవం ఉన్నవారిలో జెసి దివాకర రెడ్డి, అశోక్ గజపతిరాజు, తోట నర్సింహం, రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అందులో జెసి, తోట, రాయపాటి ఎన్నికల ముందే తెదేపాలో చేరారు. అశోక్ గజపతి రాజు తెదేపాలో సీనియర్ నాయకుడు, ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైనవారు. అందువలన ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైనా ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి పదవిని పొందలేకపోయారు. ఆయన తెదేపాలో చేరిందే కేంద్ర మంత్రి పదవిని పొందే తన కలను నిజం చేసుకోవటం కోసం.
మొత్తానికి చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన పరష్కారాన్ని కనుగొంటారనే ధైర్యం మాత్రం అందరిలోనూ ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more