తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాలను చేపట్టటానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆదివారం తన అంతరంగంలోని మాటను వెల్లడిస్తూ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని తాను ముఖ్యమంత్రిగా పని చేస్తానని అన్నారు.
రాష్ట్ర రాజధాని నిర్ణయం జరిగేవరకు తాను విజయవాడ, గుంటూరు నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తానని అన్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రపాలనను సమర్ధవంతంగా జరపటం కోసం హైద్రాబాద్ లో కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యవలసివున్నా, చాలవరకు సమావేశాలు, నిర్ణయాలు గుంటూరు నుంచే జరుగుతాయని అన్నారాయన. అంటే నామమాత్రంగా హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి నుంచే హైద్రాబాద్ కి దూరంగా కార్యకలాపాలను నిర్వహించటం మంచిదన్న ఉద్దేశ్యంలో ఉన్నారని తెలుస్తోంది.
అంతేకాదు తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించటంతో తెలంగాణా ప్రజలు తమ దైన పాలనను ఎంతగా కోరుకుంటున్నారో అర్థమౌతోంది. అలాంటి సందర్భంలో చంద్రబాబు తన కేంద్రాన్ని హైద్రాబాద్ కాకుండా మరోచోటకి మార్చుకోవటమే మంచిదని చంద్రబాబు సలహాదారులు అంటున్నారు. అనధికారికంగా పని మొదలుపెట్టిన ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పనిచెయ్యవలసిన విధానం గురించి ప్రణాళికలు సిద్ధంచేసారు. రైతు ఋణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుని వాగ్దానం చేసిన చంద్రబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ విమర్శించినట్లుగా సంభవంకాని పనేమీ కాదని, సరైన రీతిలో ఆర్థిక ప్రణాళికలు వేసినట్లయితే తప్పకుండా సాధించగల విషయమేనని ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more