నిన్న వెలివడ్డ మున్సిపల్, నగరపాలిక వోట్ల లెక్కింపులో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. కాంగ్రెస్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటూ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన సంతోషాన్ని వ్యక్తపరచారు. పురపాలక ఎన్నికల విషయంలో తమ అంచనా ఎంతమాత్రం తప్పలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆనందానికి ఒక్క పురపాలక, నగరపాలక ఎన్నికలలో అధిక శాతం స్థానాలను గెలుచుకోవటమొక్కటే కాదు ఇంకా కారణాలున్నాయి!
కాంగ్రెస్ పడిపోయిందంటూ ఇతర పార్టీలు, పత్రికలు ఎలుగెత్తుతున్న తరుణంలో తెలంగాణాలో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుచుకోవటం పార్టీ నాయకులు, శ్రేణలలో ఊపిరిపోసింది. ఈ ఫలితాలనే గనక రిఫరెండంగా తీసుకుంటే సార్వత్రిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టే అవకాశం ఉందని ఆశ మొలకెత్తుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీని మోసగించిందనే భావనతో కసిగా ఉన్న ఆ పార్టీకి తెరాస కంటే ఎక్కువ మున్సిపాలిటీలు కైవసం కావటం నిజంగా ఆనందమే.
ఇక తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యక్తిగతమైన గెలుపే. అందుకు కారణం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వటం మీద పార్టీలో కలకలం రేగుతూ వస్తోంది. జానారెడ్డి లాంటి నాయకుడికి పిసిసి పగ్గాలిస్తే బాగుండేదని, పొన్నాల నాయకత్వం అంత ఫలితాలనిచ్చేదిగా లేదని సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఈ గెలుపు పొన్నాలకు పేరు తెచ్చిపెడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా సత్ఫలితాలనందించిన నాయకుడిగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక దీనిలాగానే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడితేనా అని అనుకుంటున్నారు.
ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పోల్స్ ఫలితాలు అమితానందాన్ని కలిగించాయి. మిఠాయిలు పంచిపెట్టుకుని బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ నాయకులు ప్రతివారూ పొన్నాల నోటిని తీపిచేసారు.
మొత్తం 525 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంటే, తెరాస 313, తెదేపా భాజపా కూటమి కేవలం 162 స్థానాలను గెలుచుకున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more