29 వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణాలో తొలి ప్రభుత్వం మాదేనంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ధీమా వ్యక్తంచేసారు.
బుధవారం జరిగిన పోలింగ్ తర్వాత సర్వే నిర్వహించిన తెరాస తమ పార్టీకి 58 నుంచి 75 అసెంబ్లీ స్థానాలు, 12 నుంచి 14 లోక్ సభ స్థానాలు లభించటం ఖాయమంటున్నారు. 60 అసెంబ్లీ స్థానాలైతే ఎటూ పోవని, స్వతంత్ర అభ్యర్థులలో కొందరు తెరాసలో చేరిపోతారని కెసిఆర్ భావిస్తున్నారు. దానితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి ఎటువంటి అడ్డంకీ ఉండదని తెరాస భావిస్తోంది.
దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గెలిచే సీట్ల సంఖ్యను వెల్లడి చెయ్యటానికి ఇష్టపడలేదు. కానీ కాంగ్రెస్ నేతలు గెలుస్తున్నట్లుగా తెలుసుకుని ఆ సంతోషంలో ఉన్నారని, తెరాస నేతలు మాత్రం గెలుపొందే ఆనందాన్ని నటిస్తున్నారని అన్నారు.
తమపై కెసిఆర్ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్ఫుటంగా ప్రసారం చేసిందని, కానీ తాము సమాధానంగా ఇచ్చిన విషయాలను మాత్రం కవర్ చెయ్యలేదని పొన్నాల వాపోయారు. కెసిఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలంతా దీటైన సమాధానం చెప్పినా అది మీడియాలోకి రానందుకు పొన్నాల విచారాన్ని వ్యక్తంచేసారు.
మే 16 కల్లా ఏ విషయం తేలిపోతుందని అందరికీ తెలిసిన విషయాన్నే పొన్నాల తెలియజేసారు. తెరాస నాయకులు మాత్రం గెలుస్తామన్న ధీమాలో ఢిల్లీ ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more