తమ గురించి చెప్పుకునేదానికంటే ఇతరులను విమర్శించటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న ప్రస్తుతపు రాజకీయ ధోరణిలో భాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుని దొరా అని ఒకరు సంబోధిస్తే, ఆయన పిట్టల దొర అని మరోకరు వ్యాఖ్యానించారు.
ఆదివారం కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో పర్యటించిన సందర్భంగా, ఆ పిట్టలదొర మాట విని నమ్మవద్దని, ఒకరోజు పనిచేసి మూడు రోజులు పడుకుంటాడని అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనని పని రాక్షసుడని అన్నారని అన్నారు. కెసిఆర్ నాయకుడు కాదని, స్వార్థపరుడని, మాయల ఫకీరని, స్వలాభం కోసం సీమాంధ్రుల మీద పగపెంచి విద్వేషాలను రగిల్చే పనిలో పడ్డారని విమర్శించారు చంద్రబాబు. నాయకుడనేవాడు సేవ చేస్తాడు కానీ పగలు పెంచి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడని అన్నారాయన.
మోదీ, తను, పవన్ కళ్యాణ్ తెలంగాణా అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని, కెసిఆర్ మాత్రం తన కుటుంబ సంక్షేమం కోసమే వసూళ్ళు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. ఎన్డియే వస్తేనే నవ తెలంగాణా వస్తుందన్న చంద్రబాబు దుష్మన్ అని, సన్నాసి అని మోదీని విమర్శిస్తున్న కెసిఆర్ నాలుక గురించి ఏమనాలో తెలియటం లేదన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైన తెరాస ఒకసారి కరీం నగర్, మరోసారి మహబూబ్ నగర్, ఇప్పుడు మెదక్ స్థావరంగా చేసుకుందని, రేపు మరెక్కడికి పోతాడో తెలియదని, చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా మరోచోట చెప్తుంటారని కెసిఆర్ ని విమర్శించిన చంద్రబాబు, ఆయనందుకే ఎన్నికలకో జిల్లా మారుతుంటారని, ముప్ఫై సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ చేసిందంటూ ఏమీ లేదని, ఒకవేళ ఉంటే చెప్పమని సవాల్ చేసారు. ఉద్యమం పేరుతో అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎకరాకు కోటి రూపాయల ఆదాయంగా మార్చి చెప్తున్నారని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దొరా అని కెసిఆర్ ని సంబోధిస్తూనే బిసిలను ఏమన్నా అంటే నీ తాట తీస్తానని హెచ్చరించారు. తెలంగాణా నీళ్ళకోసం జీవితంలో మొదటిసారి పరాయి రాష్ట్రంలో జైల్లో ఉంటే తెలంగాణా నాయకులు హేళన చేసి మాట్లాడారే తప్ప తెలంగాణాకు ఏమీ చెయ్యలేదన్నారు చంద్రబాబు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more