ఎన్నికల ముందు పొత్తులు ఇప్పటి వరకు తేట తెల్లంగానే ఉన్నాయి కానీ ఎన్నికల తర్వాత ఎలా ఉంటాయన్నది ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి వుంటాయని తెలుస్తోంది. ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చు కాబట్టి ఎన్నికల తర్వాత పొత్తులు అనివార్యమని అర్థమవుతోంది.
ఈ విషయంలో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ఫ్రంట్ తో కలవవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇంతవరకు యుపిఏని నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఇక ధర్డ్ ఫ్రంట్ కి మద్దతునిస్తూ ఎన్డీయేని అధికారంలోకి రానివ్వకుండా చూడవచ్చని చవాన్ మాటలలో అర్థమౌతోంది. ఎన్నికలలో ఒకవేళ ఎన్డియేకి మెజారిటీ సీట్లు లభించినా, అందులో చాలా మంది సభ్యులకు మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టటం అంగీకారం కాదని కూడా పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్నికలలో భాగం వహించకపోవటం మంచిదన్న అభిప్రాయాన్ని చవాన్ వెలిబుచ్చినప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు తెలిపింది. అయితే, తాను కేవలం పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటును దృష్టిలో పెట్టుకునే అలా మాట్లాడానని, ఇతర దేశాలలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ ఎన్నికలలో పోటీ చెయ్యటానికి అవకాశమే వాళ్ళ రాజ్యాంగం కల్పించలేదని, తాను కేవలం ఒక సూచనను మాత్రమే ఇవ్వటం జరిగిందని చవాన్ అన్నారు.
పృథ్వీరాజ్ చవాన్ మాటలే నిజమైతే, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారం దక్కకపోయినా పరవాలేదు, యుపిఏ ని నడిపించకపోయినా పరవాలేదు కానీ, భాజపా మాత్రం అధికారం చేపట్టగూడదు, నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదన్న ఉద్దేశ్యం కనపడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more