బీహార్ లోని ముంగేర్ జిల్లాలో జమూయి నియోజకవర్గానికి తరలివెళ్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద మావోయిస్ట్ లు కాల్పులు జరపగా ఇద్దరు జవాన్లు మరణించారు, ఏడుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని భగల్ పూర్ హాస్పిటల్ కి తరలించారు. మృతిచెందిన జవాన్ల దేహాలను ఖరగ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
పోల్ డ్యూటీ మీద రెండు జీపుల్లో తారాపూర్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో వెళ్తున్న 131 సిఆర్ పిఎఫ్ బెటాలియన్ మీద కాల్పులు జరిగాయని ఖరగ్ పూర్ డిఎస్పీ రంజన్ కుమార్ తెలియజేసారు. మావోయిస్ట్ లు ముందుగా బాంబు పేల్చి సవా లాఖ్ బాబా మందిర్ దగ్గర వాళ్ళని చుట్టుముట్టారు. ఈ ఘటన ఉదయం 5.30 కి జరిగింది.
మరో ఘటనలో బాంకేబజార్ ప్రాంతంలో గయ పోలీసులు ఒక్కొక్కటి 30 కిలోలున్న ఆరు బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేసారు.
మావోయిస్ట్ లు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. ఆరు నియోజకవర్గాల్లో ఉన్న 10215 పోలింగ్ స్టేషన్లలో 3885 ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేందుకు 51000 రక్షక భటులను విధుల్లోకి పంపించారు. 350 మోటార్ సైకిళ్ళ మీద పాట్రోలింగ్ జరుగుతోందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలియజేసారు. ఇవి కాకుండా మూడు హెలికాప్టర్లు, పాట్నా ఎయిర్ పోర్ట్ లో ఒక ఎయిర్ ఆంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఒడిశాలో మల్కాన్ గిరి జిల్లా మత్తిలి సమీపంలో మహూపొదర్ పోలింగ్ కేంద్రం మీద దాడి చేసిన మావోయిస్ట్ లు ట్రక్ కి నిప్పంటించి నాలుగు ఇవిఎమ్ లను ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనతో మహూపొదర్ లోని 4 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది. ఇది చిత్రకొండ నియోజకవర్గం క్రిందికి వస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more