ఎట్టకేలకు భాజపా ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ఉదయం విడుదలైంది కానీ దాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. అందుకు కారణం అస్సాం, త్రిపురలలో ఎన్నికలు జరుగుతుండటం.
ఉదయం మేనిఫెస్టో విడుదలౌతున్న సమయంలో ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ, సీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులున్నారు. ఎన్నికల మేనిఫెస్టో బృందానికి నేతృత్వం వహించిన మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ ఈ కమిటీలో 17 మంది సభ్యులు పనిచేసారని, రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన లక్షలాది సూచనలను పరిశీలించి ఈ మేనిఫెస్టోని తయారు చెయ్యటం జరిగిందని అన్నారు. అవినీతి నిర్మూలన, నల్లధనం అంశాలు ఈ మేనిఫెస్టోలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని కూడా ఆయన అన్నారు.
మన దేశం గత పది సంవత్సరాలలో చూస్తే అభివృద్ధిలో ఎంతో వెనక్కి పోయిందని, ఈ మేనిఫెస్టో ద్వారా పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని జోషి అన్నారు. రామ మందిరం పునర్నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాజ్యాంగ బద్ధమైన పరిధిలో నిర్మాణాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తామని కూడా జోషి తెలియజేసారు.
మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో తప్ప ఎఫ్ డి ఐ ని ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలను పెంచటానికి, స్థిరాస్తులు పెంచటానికి అనుమతిస్తామని కూడా మేనిఫెస్టోలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసిన ఆహార భద్రత, విద్యాహక్కులను కూడా పరిరక్షిస్తామని భాజపా వాగ్దానం చేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more