టిజెఎసి ఛైర్మన్ కోదండరామ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన టిజెఎసి విస్తృతస్థాయి సమావేశంలో టిజెఎసిని నిర్వీర్యం చెయ్యాలని టిఆర్ఎస్ చూస్తోందన్న వాదన చర్చలోకి వచ్చింది.
తెలంగాణాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలుమార్లు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను తగలబెట్టటం, వాళ్ళని తెలంగాణా ద్రోహులుగా ప్రకటించటం జరిగిందని, వాళ్ళకి తెలంగాణాలో స్థానం లేకుండా చెయ్యాలనే పిలుపును పలుమార్లు జనంలోకి తీసుకెళ్ళటం కూడా జరిగిందని, అదే విధానంలో కాంగ్రెస్ టిడిపి నాయకులతో జెఏసి కార్యకర్తలు పోరడారని, ఇప్పుడు అదే నాయకులను తెరాస తన పార్టీలో చేర్చుకోవటం జరుగుతోందని అన్న జెఏసి నాయకులు, నిన్నటి దాకా తెలంగాణా ద్రోహులైనవారు తెరాసా లో చేరగానే పునీతులౌతారా అంటూ ప్రశ్నించారు.
భాజపాను వాడుకున్నంత కాలం వాడుకున్న తెరాస ఇప్పుడు ఆ పార్టీని పక్కకు పెట్టేసిందని కూడా వ్యాఖ్యానించటం జరిగింది.
టి జెఏసి తరఫున తెలంగాణాలో రాజకీయ ఎజెండాను తయారు చేసి దాన్ని అన్ని రాజకీయ పార్టీలు అనుసరించే విధంగా తీర్మానం చెయ్యటం కోసం జరిగిన ఈ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చంతా తెరాస మీదకు పోవటంతో ఆ సమావేశంలో ఉన్న తెరాస నాయకుడు శ్రవణ్ మధ్యలోనే సమావేశం లోంచి లేచి వెళ్ళిపోయారు.
టిఆర్ఎస్ లో చేరగానే వాళ్ళంతా తెలంగాణా వాదులైపోయినట్లైతే ఇంతకాలం ఉద్యమం చేసిన వాళ్ళ సంగతేమిటని అనేక మంది ప్రశ్నించారు.
టిజెఏసి పునర్నిర్మాణం అవసరమని, రాజకీయ పార్టీలలోకి వెళ్ళదలచుకున్న జెఏసి నాయకులు వెళ్ళవచ్చని, అయితే కొందరు జెఏసి నాయకులకు కొన్ని పార్టీలలో చేరటానికి అవకాశం దొరికినా క్రింది స్థాయి జెఏసి కార్యకర్తలకు జెడ్పిటిసి ఎంపీటీసీ బి ఫారాలను కూడా సంపాదించలేకపోయామని, 2009 లో ఎన్నికై ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు పార్టీ మారి 2014 లో మరోసారి ఎమ్మెల్యేలు అవటమే తెలంగాణా పునర్నిర్మాణమవుతుందా అని జెఎసి నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు.
టిజెఏసి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళినవారిని ఎన్నికలలో వారి గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, తిరిగి జెఏసి లోకి రానివ్వద్దనే ప్రతిపాదనకు కోదండరామ్ సుముఖత చూపించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more