ఎన్నికలలో గెలుపుకు ఎవరు దోహదం చేస్తారనుకుంటే వాళ్ళే ఆప్తులు. వ్యవధి తక్కువగా ఉంది. ఇతర విషయాలకు సమయంలేదు. కేవలం ఎన్నికలలో పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆలోచించాలి, చెయ్యాలి. ఇదీ నాయకుల ధోరణి.
నిజానికిది సాధారణ ధోరణే కానీ కేవలం రాజకీయాలకు పరిమితమైన ధోరణి కాదు. స్నేహితుడు అనేదానికి అర్థం మారిపోయిన రోజులివి. ఎవరు నీ స్నేహితుడంటే నీకు పనికి వచ్చేవాడు. నీకు ఉపయోగపడేవాడు నీ మిత్రుడు అన్నది సామాన్యంగా ఈ రోజుల్లో అందరూ పాటించే ధర్మం. అలాంటివాడితో స్నేహం చేసి ఏం లాభం అనే మాటలు వింటుంటే స్నేహం కూడా లాభాపేక్షతోనే చేస్తారా అనిపిస్తుంది. జీవితమంటేనే వ్యాపార ధోరణైపోయిందనటానికి ఇంతకంటే ఏం కావాలి. స్నేహం, ప్రేమ, పెళ్ళి, సంసారం, పిల్లలు, చదువులు, విద్య, వైద్యం అన్నీ వ్యాపారమైపోయినప్పుడు రాజకీయాలు వ్యాపారమైతే తప్పేంటి.
అందువలన తన వర్గం వాళ్ళా పరాయి వర్గం వాళ్ళా అన్నది అనవసరం. ఆచార వ్యవహారాల్లో కానీ ఆలోచనల్లో కానీ ఎంత తేడా ఉన్నాసరే, ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు ఉపయోగిస్తుందా లేదా అన్నదే ప్రశ్న కానీ మరేమీ లేదు.
మద్దతునిచ్చేవారు ఎలాగూ ఇస్తారు. వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్తే చాలు. పలకరిస్తే చాలు. ఇక మద్దతు నిస్తారా లేదా అన్న సంశయం ఉన్నచోట వాళ్ళని ఆకర్షించటానికి వాళ్ళ సంక్షేమంలో వాగ్దానాలు చెయ్యటం, ఆ వాగ్దానాలను నెరవేర్చటానికి ఎన్నికలలో గెలిపించి సాయం చెయ్యమని అర్థించటం జరుగుతుంది.
ఇంతకీ అసలు ప్రశ్నేమిటంటే ఎవరు ఎవరికి వరాలిస్తున్నారు. వోటర్లా, నాయకులా?
ఇది కేవలం సామాన్యంగా అవలంబించే విధానాన్ని గుర్తు చేసుకోవటమే కానీ అద్వానీకి విలువివ్వమని చెప్తున్న శివసేనను కానీ, తెలంగాణాలో మైనారిటీల మీద భాజపా చూపుతున్న విశేష ప్రేమను కానీ, బిసిలు దళితుల మీద వివిధ రాజకీయ పార్టీల నాయకులు చూపిస్తున్న శ్రద్ధను కాని ప్రశ్నించటానికి కాదు.
ఎన్నికల వలన ఎవరికైనా లాభం చేకూరితే అది మంచిదే!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more