సీమాంధ్రలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మధ్యే ప్రధానమైన పోటీ కనపడుతోంది.
ఆ పోటీలో ఎవరు ఎక్కువమంది వోటర్లను ఆకర్షిస్తే వారిదే గెలుపన్నది తేటతెల్లంగా ఉంది. అయితే ముందుగా ఎన్నికలకు సిద్ధమైన పార్టీ తెదేపాయే అయినా, జనాకర్షణ విషయంలో తెదేపా కంటే వైకాపా యే ఒకడుగు ముందున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన సీమాంధ్రను సింగపూర్ చేస్తానని. నినాదంలో ప్రాస బాగానే కుదిరింది, హైద్రాబాద్ ని అన్నివిధాలా అభివృద్ధి పరచిన ఘనత ఆయనకు ఎలాగూ ఉంది. ఐటి రంగంలో సాధించిన ప్రగతి శ్లాఘనీయం. కానీ రైతుల సంక్షేమం విషయంలో తప్పు చేసానని, ఇకపై అలా చెయ్యనని అన్న చంద్రబాబు సింగపూర్ ని సీమాంధ్రలో దించుతాననటంతో మరోసారి హైటెక్ కి పెద్ద పీట వేసినట్లుగానే ప్రస్ఫుటంగా పైకి కనపడుతోంది.
ఇది వ్యాపార వర్గాలకు, పెద్ద చదువులు చదువుకున్నవారికి వినటానికి చాలా బావుంటుంది, రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచటానికి ఇది బాగా పనికివస్తుందేమో అని అనిపిస్తుంది కానీ, మన దేశంలో ఇంకా కుటుంబం గడపలేనివారే అధికశాతంలో ఉన్నారు. అందువలన బీద బడుగు జనాల సంక్షేమ పధకాలే ఇంకా ఆకర్షణకు మూలంగా ఉన్నాయి. ఈ విషయంలో వైయస్ జగన్ తన తండ్రి అడుగుజాడలలో నడుస్తూ పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారు కానీ హైటెక్ కి కాదు.
ఈ సంగతి కనిపెట్టలేకపోతే తెదాపా మరోసారి రెండవ స్థానాన్నే అంటిపెట్టుకునివుండే అవకాశం కనిపిస్తోంది. అయితే అధిక శాతం జనాభా చంద్రబాబు నాయుడుకి రాష్టాన్ని అభివృద్ధి చెయ్యగల సత్తా ఉందని, మంచి యాజమాన్య ప్రతిభ ఉందని నమ్ముతున్నారు. కానీ మనిషికి ముందు కావాలసింది ఆ రోజు గడవటం, అది తీరిన తర్వాతనే మిగతా విషయాలు ఆలోచిస్తాడు. అందుకే, వోట్ల కోసం డబ్బులు, బహుమతులను పంచవచ్చనే ఆలోచన దేశవ్యాప్తంగా ఇప్పటికీ రాజకీయ నాయకులకు వస్తోంది.
ఈరోజూ గడవాలి, సమీప భవిష్యత్తులోనూ బాగు జరగాలి, దీర్ఘ కాలిక ప్రణాళికలూ ఉండాలి కాబట్టి ఎంద దూర దృష్టి ఉందని నిరూపించినా, కాళ్ళముందున్న సమస్యలను పరిష్కరించటం, తక్షణ అవసరాలను తీర్చటమనేది ముఖ్యం.
అందువలన, చంద్రబాబు నాయుడు నిజంగా తను ఆశించిన ప్రగతిని రాష్ట్రంలో తీసుకునిరావటం కోసం అధికారాన్ని చేపట్టాలీ అంటే ముందుగా ఆ పనిలోనే ఉండాలి, వోటర్లకు ఈ విషయం అర్థమయ్యే రీతిలో ప్రకటనలు చెయ్యాల్సివుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more