మనసులు కలిసిన మనుషుల చేరిక అంటే ఇదేనేమో. కాంగ్రెస్ ని పారద్రోలటమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీకి అదే ఉద్దేశ్యంతో ఉన్న తెలుగు దేశం పార్టీ చేరువవుతుండగా రాష్ట్ర విభజన వాళ్ళని కాస్త దూరం చేసింది. కానీ రెండు పార్టీల ఉద్దేశ్యాలలో సమానంగా ఉన్న కాంగ్రెస్ ని ఓడించే కార్యక్రమం మనసులో బలంగా ఉండటంతో మళ్ళీ ఆ రెండు పార్టీలు సమిష్టి సమరానికి తయారవుతున్న సందర్భంలో అదే నినాదంతో వచ్చారు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో. అంతే కాదు కాంగ్రెస్ తప్ప మరే పార్టీకైనా మద్దతివ్వటానికి సిద్ధమని కూడా ప్రకటించారాయన పార్టీ ఆవిర్భావ సభలో. ఇక లక్ష్యాలు కలిసినప్పుడు కలయికను ఎవరు ఆపగలరు.
చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా కలవటం జరిగింది. అది కూడా పార్టీ ప్రకటించిన తెల్లవారే. సమయాన్ని వృధా చెయ్యటం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో భాజపా అగ్రనేతలతో సంప్రదింపులు కూడా చేసినట్లుగా తెలుస్తోంది.
దీనితో, పవన్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్టే కాదు దాన్ని పేల్చే తుపాకీకి సైలెన్సర్ అమర్చినట్లుగా ఆయన సైలెంట్ మోడ్ లో పనిచేస్తున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగంలో ఎన్నో విషయాలను సుస్పష్టంగా తెలియజేసారాయన. అందులో, కాంగ్రెస్ తో వైరుధ్యమే కాక తెలంగాణా రాష్ట్ర సమితితోను, వైయస్ ఆర్ కాంగ్రెస్ తోనూ కలవరన్న విషయాన్ని కూడా చెప్పకనే చెప్పారు. తెరాస, వైకాపా ల మీద వేసిన చురకలు ఆయన తెదేపా, భాజపా ల మీద వెయ్యలేదారోజు.
ఈ మూడు పార్టీల పొత్తుల విషయం త్వరలోనే బహిర్గతం అవుతుందని, అందుకు వేదికగా నరేంద్ర మోదీ సీమాంధ్ర పర్యటనను ఉపయోగించుకుంటారని సమాచారం.
మదిలో ప్రేమ రగిలి కలిసుండే ఒప్పందం కుదిరినప్పుడే పెళ్ళి అయిపోయినట్లే. ఇక పెళ్ళి తంతు కేవలం నలుగురికీ ఆ విషయం తెలియటం కోసమే. అలాగే తెదేపా భాజపా జనసేనల మేలు కలయిక రాష్టంలో సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో గెలుపుని, జాతీయ స్థాయిలో అధికారం చేపట్టగల మెజారిటీని సంపాదించి పెడుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నారని తెలియవస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more