సర్వేల మీద ఆధారపడి వ్యూహరచన చేసినట్లయితే రాజకీయ పార్టీలు వైఫల్యాలను చవిచూసే అవకాశం బాగా ఉంది!
1. ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే విషయంలో సర్వే చేస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పే వాళ్ళను ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. తెలియని ప్రాంతంలో దారి అడిగేటప్పడు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశం గురించి విచారించేటప్పుడు కానీ ఎవరినిబడితే వాళ్ళని అడగం. సాధారణంగా ఆ విషయంలో అవగాహన ఉండవచ్చు అని అనుకుంటున్న వ్యక్తినే అడుగుతాం. కానీ సర్వే చేసేటప్పుడు ఎదుటి మనిషికి ఎంత అవగాహన ఉందో తెలియదు మనకి.
దీనికో పరీక్ష ఉంది. సర్వేలో తేలినదాన్నిబట్టి అభ్యర్థులకు ప్రత్యర్థుల మీద గెలుపుకున్న అవకాశంలో వ్యత్యాసం ఎక్కువగా లేనట్లయితే దాన్ని పూర్తిగా నమ్మలేము. అదే వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే దాని మీద ఆధారపడవచ్చు. నిజమైన పోలింగ్ లో ఒక వోటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్లే కానీ ఒపీనియన్ పోలింగ్ లో అలా కాదు సరికదా అది నమ్మదగ్గ సర్వే ఫలితం కాజాలదు.
2. ఈ మధ్యకాలంలో చేస్తున్న సర్వేలలో, లక్షన్నర వోటర్లున్న చోట శాంపుల్ గా వెయ్యి నుంచి మూడు వేల మందిని ప్రశ్నించి దానితో అంచనాలు వేస్తున్నారు. కానీ అది సరైన ఫలితాన్నివ్వకపోవటానికి కొన్నికారణాలున్నాయి. ఆ ప్రాంతంలో అభ్యర్థిగా నిలబడదలచుకున్న వ్యక్తులు సర్వే రిపోర్ట్ తమకు అనుకూలంగా వచ్చేట్టుగా చేసుకుని తద్వారా పార్టీ సీటును సంపాదించుకునే అవకాశం ఉంది.
3. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య చేసిన ప్రకటనలో ప్రజాభిప్రాయాన్నిబట్టి అభ్యర్థుల సీట్లను ఖరారు చేస్తామని చెప్పారు. ఇది నిజంగా చాలా కొత్త విధానం, స్వాగతించవలసిందే. కానీ, ఇందులో మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.
పోల్చి చూడటంలో ఎప్పుడైనా సరైన విధానాన్ని అవలంబించాలి! ఈ రోజున్న స్థితిలో చాలా నియోజకవర్గాల్లో తెదేపా రెండవ స్థానంలో ఉందన్న విషయం అందరికీ తెలుసు. అందువలన ఆ అభ్యర్థులు కూడా రెండవ స్థానం వారవుతారు కానీ గెలుపు గుర్రాలు కారు. అందువలన వారికి అనుకూలంగా తమ అభిమతాన్ని చెప్పేవారెవరు? తెదేపా సభ్యులే! వాళ్ళు కూడా పార్టీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నవారే. ఈ విధానంలో ఉన్న పెద్ద లొసుగు ఇదే. అభ్యర్థులు రెండవస్థానం వారే వస్తారు సర్వేలో. అంటే తెలుగు దేశం పార్టీ ఆ అభ్యర్థులను ఎంపిక చెయ్యటం వలన ఆ పార్టీకి దక్కేది రెండవ స్థానం మాత్రమే. కాబట్టి పార్టీ గెలుపు, దాని ద్వారా అధికారాన్ని చేపట్ట దలచుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు రెండవస్థానంలో ఉంటూ సంతృప్తి పడదలచుకున్నారా?- అన్నది ఆయన నిర్ణయించుకోవాల్సిందే!
ఏ ప్రాంతంలోనైనా గెలిచే నాయకులు తెదేపాలో ప్రస్తుతం ఉండాలని లేదు. తెదేపాలో చేరాలని అనుకుంటుండవచ్చు. అంటే తెదేపాలో ఉన్న వాళ్ళకి, లేనివాళ్ళకి మధ్య ఉన్న పోటీ ఇది. దీనిలో (ఈ సర్వేలో) తెదేపాలో ఉన్నవాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే తెదేపాలో లేని వాళ్ళ గురించి సర్వేయే ఉండదు కనుక. దీని వలన తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రధాన ప్రతిపక్షంగా విలసిల్లుతుందేమో కానీ పగ్గాలు చేపట్టదు.
4. అదే వైయస్ఆర్ కాంగ్రెస్ విషయంలో చూసుకుంటే, ఈ విషయాన్ని ఆ పార్టీ గ్రహించినట్లే కనపడుతోంది. మొదటిసారి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ సర్వేలు కచ్చితమైన ఫలితాలనిచ్చి మార్గదర్శకాలవుతాయి. ఎందుకంటే ఆ అభ్యర్థులు వైకాపా తరఫున మొదటిసారి పోటీచేస్తున్నారు కాబట్టి. ఇదే పోల్చి చూడటంలో సరైన విధానమంటే. అన్నిటినీ ఒకే దాటన కట్టేయగూడదు.
పైగా జగన్ గెలవలేని అభ్యర్థుల విషయంలో మొఖమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పగలగటం, వాళ్ళు మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా పోకుండా వాళ్ళని సముదాయించటం చెయ్యగలిగే సామర్థ్యం ఉందని కూడా ఇప్పటికే తేలిపోయింది.
అదేవిధంగా, అందరినీ తృప్తి పరచటం సాధ్యమైన పని కాదన్న విషయాన్ని తెలుగు దేశం పార్టీ తెలుసుకోవలసివుంది. అందువలన ప్రధమ స్థానానికి తయారవాలి కానీ రెండవ స్థానానికి కాదు. పోయిన సారి ఎన్నికలలో కూడా తెదేపా తెలుసుకోకుండా చేసిన తప్పు ఇదే. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా మిగిలిపోయింది కానీ అధికార పక్షం కాలేకపోయింది.
సారాంశం: ఏ పార్టీ అయినా సరే సరైన విధానంలో సర్వేలు చెయ్యకుండా అభ్యర్థుల ఎంపిక చేసినట్లయితే చేతులు కాలిన ఐదు సంవత్సరాల తర్వాత ఆకులు పట్టుకున్నట్లువుతుంది. ఎందుకంటే ఎన్నికలలో ఒకసారి అవకాశాన్ని పోగొట్టుకుంటే తిరిగి దాన్ని సరిదిద్దుకోవటానికి తిరిగి ఐదు సంవత్సరాల తర్వాతనే అవకాశం లభిస్తుంది కాబట్టి. అప్పటికల్లా ప్రస్తుతమున్న నాయకులు ఐదు సంవత్సరాలు పెద్దవాళ్ళవుతారు. పార్టీ శ్రేణులను అంటిపెట్టుకుని ఉండేట్టుగా చెయ్యటం కష్టమౌతుంది.
పార్టీలకు, వారికెంతమంది వోట్లు వస్తాయన్నది లెక్క కాదు- ఏవిధంగా విజయం సాధిస్తారన్నది ముఖ్యం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఫలవంతంగా ఉంటుందన్నది ఎప్పుడో నిరూపితమైంది, ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్ కూడా ఆ లక్షణాలను పుణికిపుచ్చుకుంటోంది.
ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వైపు మళ్ళుతున్న గాలిని ఉపయోగించుకుంటూ ముందుకు పోవాలి కానీ, ఒకే వర్గం వారిని సంతృప్తి పరచే పనిలో వోటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోవటంలో విఫలమవటం సరైనది కాదు. తమ స్వార్థం కోసం సర్వేలను తప్పుదారి పట్టించేవారి వలలో పడగూడదు.
అందువలన, గెలిచే అవకాశమున్నవారిని (ఏ వర్గం వారైనా సరే) పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసుకుని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టి యోగ్యుడు, వివాదరహితుడైన ముఖ్యమంత్రికి పట్టం కట్టటం ఆశించదగ్గది.
కొత్త రాష్ట్రాలలో సమర్ధవంతం, అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని ఏర్పటు చెయ్యటానికి ఓ చిన్న ఆలోచనను మీతో పంచుకుంటూ,
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more