భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతను నాశనం చేస్తున్నాయని విమర్శించారు...
రాష్ట్ర విభజనకు పాలకులే కారణం...
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడానికి దశాబ్దాల తరబడి పాలించిన పాలకులే కారణమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమస్య ను మొగ్గలోనే తుంచకుండా తమ అవసరాలకోసం వాడుకున్నారని అన్నారు. ఫలితంగానే అది ముదిరి నేడు రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైందని చెప్పారు. దీనికి పూర్తిగా రాష్ట్రాన్ని పాలించిన వారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
విభజనతో దేశ సమగ్రతకు భంగం...
ప్రాంతాల వారీగా జరిగే విభజనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అయితే.. 2009లోనే ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేదని ప్రశ్నించారు.
ఐదేళ్లపాటు కాలయాపన చేసి, పార్లమెంట్ చివరి సెషన్ లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో ఎందుకు విభజించాల్సి వచ్చిందని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ భచావో' అంటూ నినాదం చేశారు. అంతకుముందు, కాంగ్రెస్ హైకమాండ్ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. షిండే, మొయిలీ, షిండే, ఆంటోనీ, అహ్మద్ పటేల్ తదితరులు కలసి రాష్ట్రాన్ని విభజించిన తీరు ప్రజలను తీవ్రంగా గాయపరిచిందని చెప్పారు.
ఏ పార్టీతోనైనా కలుస్తా:
పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎన్నికల సందర్భంగా పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనా కలుస్తామని స్పష్టం చేశారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more