నాగ్ పూర్ లో ఎన్నికల ప్రచారం, నిధుల సేకరణ కోసం ఏర్పటు చేసిన సభలో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రవాల్ మీడియా మీద మరోసారి మండిపడ్డారు. మీడియా అంతా అమ్ముడుపోయిందని, నరేంద్ర మోదీని గెలిపించటం కోసం మీడియాలో అంతా పాటుపడుతున్నారని అన్నారు.
గత సంవత్సరకాలంగా మోదీ మోదీ అంటూ మోదీ జపాన్ని చేస్తున్నారని, కొన్ని ఛానెల్సైతే అవినీతి అంతమొందుతోందని, రామరాజ్యం వస్తోందని, ఇక్కడ ఇదైంది, అక్కడ అదైంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే ఎందుకో తెలుసా- వాళ్ళకు డబ్బులు ముట్టాయి కాబట్టి.
గుజరాత్ లో గత 10 సంవత్సరాలలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం చెప్పరు మీడియాలో. అద్వానీకి ఒక రూపాయకే భూమిని విక్రయించారు. ఈ సంగతీ చెప్పరు. అరవింద్ భద్రత గురించి మాట్లాడుతారు. జడ్ సెక్యూరిటీ, వై సెక్యూరిటీ అంటూ వెధవ పనికిమాలిన సెక్యూరిటీ .... మోదీ గురించి మాత్రం సత్యం చెప్పరు.
ఈ సారి మీడియా మొత్తం అమ్ముడుపోయింది. డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా పెద్ద కుట్రపూరితమైన చర్య. దీని అంతు తేలుస్తాం. మాకు అధికారం రానీండి, మీడియాకు చెందినవారితో సహా అందరి మీద కేసులు పెట్టి జైళ్ళకి పంపుతాం అన్నారు కేజ్రీవాల్.
కేజ్రీవాల్ నిర్వహించిన నిధుల సేకరణ 5 సితారల హోటల్ లో జరిగటాన్ని విమర్శించిన నాగ్ పూర్ వాసులూ ఉన్నారు. కేజ్రీవాల్ తో కలిసి భోజనం చెయ్యటానికి పెట్టిన రూ.10000 ఖర్చుకు బదులు విదర్భ వితంతువులకు సాయం చెయ్యొచ్చుగా అన్నారు వాళ్ళు.
అరవింద్ కేజ్రీవాల్ మీడియా మీద విరుచుకు పడటం ఇది మొదటిసారి కాదు, ఆధారాలు లేకుండా ఆరోపించటం కూడా మొదటి సారి కాదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more