Kamalanathan committee visiting hyderabad

Kamalanathan Committee visiting Hyderabad, AP Chief Secretary PK Mohanty, Addition Chief Secretary Sinha, APNGOs, TNGOs, TGOs, Gulam Nabi Azad, Digvijay Singh, Srikrishna Committee

Kamalanathan Committee visiting Hyderabad

ఉద్యోగుల విభజనకు కమలనాధన్ కమిటీ హైద్రాబాద్ రాక

Posted: 03/06/2014 08:30 AM IST
Kamalanathan committee visiting hyderabad

రాష్ట్ర, కేంద్ర ఉద్యోగులను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విభజించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు విశ్రాంత ఐఏఎస్ కమలనాథన్ నాయకత్వంలో త్రిసభ్య కమిటీ ఢిల్లీ నుంచి ఈరోజు హైద్రాబాద్ చేరుకుంటోంది. 

ఆ పనులను రాష్ట్రంలో నేతృత్వం వహించి నిర్వహిస్తున్న ఎపి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతితో ఈ రోజు కమలనాథన్ కమిటీ మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ అవుతుంది.  ఆ భేటీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ కె సిన్హా కూడా పాల్గొంటారు. 

ఇప్పటికే ఆర్థిక శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను తయారు చేసింది.  వాటిని మొహంతి కమలనాధన్ కమిటీకి అందజేస్తారు. 

ఈలోపులో విభజన దృష్ట్యా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఉద్యోగులు, అధికార స్థాయిలో ఉన్నవారు వాళ్ళు తెలంగాణాకు చెందినవారా లేక ఆంధ్రప్రదేశ్ కా అన్నది తెలుసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  పరీక్షా సమయంలో హాల్ టికెట్ వచ్చి పరీక్ష రాసే హాల్ లో తమ సీటు ఎక్కుడుందోనని ఆత్రుతపడే విద్యార్థులలా ఉంది కొందరు ఉద్యోగుల పరిస్థితి.

టిఎన్జీవోలు, టిజీవోలు, ఎపిఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు తమ వాదనని వినిపించటం కోసం కమలనాధన్ కమిటీని కలవటానికి ఉత్సుకతను చూపిస్తున్నారు.  అందుకోసం ప్రధాన కార్యదర్శి మొహంతీని ఆశ్రయిస్తున్నారు. 

లోగడ కూడా గులామ్ నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, శ్రీకృష్ణ కమిటీ, శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి, మొదలైనవారిని కలవటానికి ఉద్యోగులే కాకుండా రాజకీయనాయకులు ఎందరో బారులు తీరారు.  కానీ ఎవరెన్ని చెప్పినా తాపీగా ఓపిగ్గా వినే ఢిల్లీ పెద్దలంతా తాము చెయ్యదలచుకున్నది చేసేస్తారని ఇంకా చాలా మందికి అర్థం కావటంలేదనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles