తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్, రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆనందంలో.. తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికంటే లాభపడేది గిరిజనులేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, గిరిజనులందర్నీ ఉద్యోగులను చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని మూరుమూల గ్రామల్లో ఉన్న గిరిజనులు వర్షాకాలంలో రోగాల బారిన పడుతున్నారని, వారిని వర్షాకాలంలో కొండలు, గుట్టల్లోంచి తరలించడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
108 పెడితేనే సంతోషపడిపోయిన గిరిజనుల్ని హెలికాప్టర్ లో తరలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని జిల్లాల్లో చెప్పండి అని కార్యకర్తలకు హితబోధ చేశారు. టీఆర్ఎస్ గురించి ప్రచారం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లాను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యవతి రాథోడ్, నగేష్ లు టీఆర్ఎస్ లో చేరిన సందర్భలో, వరంగల్ జిల్లాకు కృష్ణా, గోదావరి నదుల జలాల్లో వాటా ఉందని అన్నారు. ఆ నీటిని వరంగల్ జిల్లా సాగు అవసరాలకు సరఫరా చేసి పచ్చదనంతో కనువిందు చేసేలా చేస్తానని కేసీఆర్ అన్నారు.
తెలంగాణను సువర్ణ రాష్ట్రంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రా పాలకులు మోసం చేయడం వల్ల వరంగల్ జిల్లా సస్యశ్యామలం కాలేకపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారత దేశానికి కాశ్మీర్ ఎలాంటిదో తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లా అలాంటిదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 12 రెట్లు అదనపు వర్షపాతం నమోదవుతుందని, అందువల్ల అది ఉత్తమ పర్యాటక క్షేత్రంలా భాసిల్లుతుందని కేసీఆర్ అన్నారు.
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కడితే ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎకరం భూమి కూడా వృథాగా పోకుండా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more