హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల పై మెరుపు దాడులు చేయటంతో, పెట్రోల్ యజమానులు చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులను తిప్పికొట్టానికి పెట్రోల్ బంకు యజమానులు తిరిగి మెరుపు సమ్మె చేయటం ప్రారంబించారు. సమ్మె చేస్తున్న పెట్రోల్ బంక్ యజమానులతో తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి.
అంతకుముందు పెట్రోల్ బంక్ యజమానులు సమ్మె చేపట్టడడంపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెట్రోల్ బంక్ లలో ఉన్న పరికరాలను రెండు నెలల్లోగా మార్చుకోవాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు సూచించారు. అవకతవకలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ బంక్ లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఇప్పటికే 86 పెట్రోల్ బంకులపై కేసులు నమోదు చేసి 11 బంక్ లను సీజ్ చేశారు. దీనిపై పెట్రోల్ బంక్ యజమానుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రోల్ కోసం ప్రభుత్వ పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరి నిలబడ్డారు.
ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకున్నారు. వెంటనే సమ్మె విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనితో బంకు యజమానుల సంఘంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్చలు జరిపారు.
పెట్రోల్ బంక్ లలో ఉన్న పంపులలో ఒక మిషన్ ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఆ మిషన్ లు పంపిణీ చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, ఇది ఎలా ఆపరేట్ చేయాలో తమకు తెలియదని బంకు యజమానులు పేర్కొన్నారు.
కేవలం ధర మార్చుకోవడానికి మాత్రమే తాము ఈ మిషన్ ను ఉపయోగిస్తామని చెప్పారు. బంకుల్లో ఉన్న లోపాలను సవరించుకుంటామని, మిషన్లు సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలతో చర్చిస్తామని బంకు యజమానుల సంఘం చెప్పింది. రెండు నెలలల్లోగా లోపాలను సవరించుకోవాలని అధికారులు సూచించారు.
పంపులను సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలతో చర్చించి లోపాలను సవరించుకుంటామని పెట్రోల్ బంక్ యజమానుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చివరకు సమ్మె ముగియడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more