ఢిల్లీకి పోతున్నా, తెలంగాణాతోనే తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఈ రోజు హైద్రాబాద్ తిరిగివస్తున్న సందర్భంగా ఆయన అక్కడినుండి తీసుకుని వస్తున్న విజయసౌరభాన్ని నలుదిశలా వెదజల్లేందుకు తెరాస నాయకులు, కార్యకర్తలు లక్షమంది వరకు కూడి కెసిఆర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్నారు.
ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మధ్యాహ్నం 1.00 గంటకి చేరుకునే కెసిఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడి నుండి బేగం పేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడే ఆయనకు స్వాగతం పలకటానికి శాసనసభాపక్షం, వెయ్యి మంది బ్రాహ్మణులు పూర్ణకుంభంతో తయారుగా ఉంటారు. వివిధ మతాచార్యులు కెసిఆర్ సమక్షంలో ఆశీర్వదిస్తారు. అక్కడి నుండి గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వరకు కెసిఆర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విజయ రథం మీద వెళ్తారు.
కెసిఆర్ భూమార్గంలో గన్ పార్క్ కి చేరుకునే సరికి ఆకాశమార్గంలో అక్కడికి వచ్చిన హెలికాప్టర్ ఆయన మీద పూల వర్షం కురిపిస్తుంది. అమరవీరులకు నివాళులర్పించిన పిదప తెలంగాణా భవన్ కి చేరుకున్న కెసిఆర్ అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతారు.
ఇదీ ఈ రోజు కెసిఆర్, తెరాస నాయకుల ముఖ్య కార్యక్రమం.
ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించటం జరిగింది. కెసిఆర్ తో పాటు సుమారు లక్షమంది ర్యాలీలో పాల్గొంటారని అంచనా. అందువలన మిగిలిన ట్రాఫిక్ కి అంతరాయం కలుగకుండా ఉండటం కోసం మంగళవారం నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గన్ పార్క్ వైపుగా వెళ్ళే వాహనదారులు తమ వాహనాలను వేరే మార్గాల ద్వారా తీసుకెళ్ళవలసిందిగా తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more