ఆదివారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు భేటీ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను కేవలం తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పుకోవటానికి వెళ్ళానే తప్ప రాజకీయాంశాల గురించి సంప్రదింపులకు పోలేదని అన్నారు. అయితే ఇతర విషయాలలో సంప్రదింపులకు పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తనతో టచ్ లో ఉంటారని చెప్పారు.
కానీ పార్టీ నాయకులు మాత్రం తెరాసా విలీనం కాంగ్రెస్ లో జరుగుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
60 సంవత్సరాల నుంచి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆశిస్తున్నా, 10 సంవత్సరాల నుంచి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని పెట్టి నడిపించినందువలనే ఉద్యమం ఉధృతరూపాన్ని తీసుకుని పరిస్థితిని ఈ మేరకు తీసుకునివచ్చింది. అందువలన తెలంగాణా ఉద్యమానికి తెరాసకు బంధం ఏర్పడటమే కాకుండా తెరాస ఉద్యమానికి ప్రతిరూపమనే అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతున్న తెలంగాణా రాష్ట్రంలో ఆధిపత్యం సంపాదించాలంటే తెరాసతో కలవక తప్పని పరిస్తితి కాంగ్రెస్ పార్టీది.
దానికితోడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రోజురోజుకీ పుంజుకుంటోంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాలలో తన పట్టును పోగొట్టుకుంది. రెండు శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి కంచుకోట అనుకుంటున్న ఢిల్లీ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎగరేసుకుపోయింది. అటువంటప్పుడు తన బలాబలాలను సమీకరించుకునే యత్నంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా మీద ఆశపెట్టుకోవటం సహజమే.
కానీ ఆ పార్టీకి దురదృష్ట వశాత్తూ భాజపా కూడా తెలంగాణా ఏర్పాటులో భాగస్వామ్యాన్ని ప్రకటించుకుంటోంది, ఆ సత్యం సుస్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే భాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు పాసవటమన్నది అసాధ్యమన్నది అందరికీ తెలుస్తూనేవుంది. సీమాంధ్ర ఎలాగూ కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయింది. అందువలన తెరాస విలీనం కానీ కనీసం ఆ పార్టీతో పొత్తు కానీ కాంగ్రెస్ కి అనివార్యమైపోయింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more