రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం లభించటంతో చరిత్ర సృష్టించిన ఆనందం తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో పెల్లుబికింది. జైపాల్ రెడ్డితో సహా అందరూ పార్లమెంటు భవన్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఆనందంతో కేరింతలు కొడుతూ జై తెలంగాణా అంటూ సంతోషాతిశయంతో పాటు జై జై సోనియా గాంధీ అంటూ విభజన బిల్లును ఉభయ సభలలో గట్టెక్కించినందుకు నాయకులు పార్టీ అధినాయకత్వానికి తమ కృతజ్ఞతలను కూడా తెలుపుకున్నారు.
సోనియా గాంధీ పోస్టర్ ని ప్రదర్శిస్తూ జైజై లు పలకటమే కాక మిఠాయిలతో నోరు తీపి చేసుకున్నారు. జూలై 30 2013 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన బిల్లుకు అంకురార్పణ జరిగిన తర్వాత దిన దిన గండంగా పురిటి నొప్పులను పడుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ప్రసవించింది. ఇక బొడ్డు కోసి స్నానం చేయించే పని మాత్రమే మిగిలిపోయింది. రాష్ట్రపతి ఆమోదంతో ఆ పని కూడా పూర్తై, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పాయింట్ మెంట్ డే ప్రకటనతో ఇక నామకరణ మహోత్సవం కూడా జరిగిపోయినట్లే.
ఆఖరి ప్రయత్నంగా సీమాంధ్ర ఎంపీలు రాజ్యసభ వెల్ లోనే రోజంతా గడిపుతూ అంతరాయం కలిగిస్తున్నా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు తన పని తాను చేసుకుంటూ పోయారు.
ప్రధాన ప్రతిపక్షమైన భాజపా నుంచి అడ్డంకులేమీ రాకుండా చూసుకుని, రాజ్యాంగ సవరణల్లాంటి పనులతో జాప్యం జరగకుండా చూసి బిల్లను గట్టెక్కించిన ఘనత ప్రధాన మంత్రికే దక్కుతుంది. హైద్రాబాద్ ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ హైద్రాబాద్ వాసుల భద్రత కోసం ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాల కాలం శేషాంధ్రప్రదేశ్ లో పన్ను రాయితీని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
విభజనకు తమ సమర్ధనను తెలియజేస్తూనే భాజపా నాయకులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అధికార పక్షం బిల్లును ఆమోదించిన తీరుని తప్పు పట్టారు. సభలో చర్చైతే జరిగింది కానీ సభ్యుల కంఠశోష మాత్రమే మిగిలింది. బిల్లు అధిష్టానం ఆశించిన రీతిలో పాసైపోయింది.
ధృఢ నిశ్చయంతో ముందుకెళ్ళి విభజన బిల్లును ఆమోదింపజేసిన సోనియా గాంధీకి తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా అడ్డంకుల మధ్య బిల్లు పాసవకపోతే కాంగ్రెస్ కి, ముఖ్యంగా సోనియా గాంధీకి తెలంగాణా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన పేరు వచ్చుండేది కాదేమో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more