రాష్ట్రంలోని రాజకీయాలు ఎటు పోతున్నాయే ఎవరికి అర్థం కావటంలేదు. నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సపోర్టు చేసి, సమైక్యంద్ర కు మద్దతుగా ఉన్న ఆ నలుగురే, సీఎం పదవికి రాజీనమా చేసిన వెంటనే ..ఆ కుర్చీ మీద కర్చీఫ్ వేయటానికి సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించుకోవాలని ఉబలాటపడుతున్న రాష్ట్ర మంత్రులు ఆనం, కన్నా, బొత్స, రఘువీరా రెడ్డి గవర్నర్ నరసింహన్ తో భేటీ ఆయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనుందనే వార్తల నేపథ్యంలో వీరు గవర్నర్ ను కలిశారు.
అయితే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే పాలనాపగ్గాలు చేతిలోఉండడమే మేలని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నలుగురిలో ఎవరు సీఎం పదవిని దక్కించుకుంటారో తెలియదు గానీ, రాష్ట్రం ప్రజల్లో మాత్రం తీవ్రమైన ఉత్కంఠత నెలకొని ఉంది. సీమాంద్ర నుండి ఈ నలుగురు పోటీ పడితే.. తెలంగాఱ ప్రాంతం నుండి మరో నాలుగురు సీఎం ఛైర్ కోసం ఢిల్లీ లో రాజకీయం చేస్తున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more